Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నేను వ్యభిచారినా? గన్ లైసెన్స్ తీసుకొంటా.. వాళ్లను కాల్చి పారేస్తా.. మాధవీలత ఫైర్
ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీలపై సినీ తార, బీజేపీ నేత మాధవీలత భగ్గుమన్నారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడంపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల సైబారాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా మీడియాలోకి వచ్చింది. తాజాగా మీడియాతో మాట్లాడిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మాధవీలత చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఏమిటంటే..
మహిళలను అణగారిన జాతిగా
రాజ్యాంగం స్త్రీకి స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కల్పించింది. మహిళలు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చనే అధికారం, హక్కు కల్పించారు. కానీ స్త్రీని అణగారిన జాతిగా తొక్కేశారు. ఆకాశమంత స్త్రీ అన్నారు. కానీ 2021 నాటికి పాతాళంలోకి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని మాధవీ లత మీడియాకు తెలిపారు.
మహిళలను టార్గెట్ చేస్తూ నీచంగా
స్త్రీకి స్వేచ్ఛ నిచ్చిన జై భీమ్ నినాదాన్ని పక్కన పెట్టి మహిళా జాతిపై నీచంగా కామెంట్లు చేస్తున్నారు. నాకు కొందరు మాధవీలత అకాలం మరణం అంటూ కొందరు సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటించారు. వ్యభిచారి అంటూ.. లంX అంటూ సహనంతో ఉండాలా? ఇలాంటి చాలా భరించాను. ఇంకా ఎన్నాళ్లు భరించాలి అంటూ మాధవీలత ప్రశ్నించారు.
వారి ముడ్డి మీద వాతలు పెట్టాలని
తనపై నీచమైన పోస్టులు పెడుతున్న తీరు చాలా బాధగా ఉంది. దేనికైనా హద్దు ఉంటుంది. నాపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిని కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో సోషల్ మీడియాలో నాపై పోస్టులు పెడుతున్న వారిని ఈ కేసులో పట్టుకొచ్చి వారిని మోకాళ్లపై కూర్చోపెట్టి ముడ్డి మీద వాతలు పెట్టాలి అని మాధవీలత పోలీసులకు సూచించారు.
గన్ లైసెన్స్ తీసుకొంటా..
నన్ను టార్గెట్ చేస్తున్నవారిని వదిలి పెట్టే సమస్యే లేదు. సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలిసి గన్ లైసెన్స్ తీసుకొంటాను. నన్ను ఎవరైనా వేధిస్తే వారిని చంపడానికి కూడా వెనుకాడను. నేను ఎవరికి భయపడే సమస్యే లేదు. సోషల్ మీడియాలో నాపై చేస్తున్న దుష్రచారాన్ని సహించలేదు అంటూ మాధవీ లత ఘాటుగా స్పందించారు.
ప్రముఖ దిన పత్రికకు సూచన
అలాగే తనను వ్యభిచారి అంటూ, తాను పోలీసుల రైడింగ్లో పట్టుబడ్డాను అంటూ తనపై పోస్టులు పెడుతూ ప్రముఖ దిన పత్రిక సోషల్ మీడియా అకౌంట్లు, ఓ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లకు ట్యాగ్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన గురించి పోస్టు చేసిన వాటిపై ప్రముఖ పత్రిక యాజమాన్యం స్పందించాలని, తగు చర్యలు తీసుకోవాలని ఆమో సూచించారు.