Don't Miss!
- Finance స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ నెస్లే చిన్న పిల్లల ఆహారం సెరెలాక్ లో చక్కెరను కలుపుతున్నట్లు కనుగొంది
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ఏనుగులు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయ్.. శ్రీరెడ్డికి కౌంటరా?.. మాధవీలతా పోస్ట్ వైరల్
గాలి ఎప్పుడు ఎలా వీస్తుందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పడం కష్టం. అలాగే శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవరిని టార్గెట్ చెప్పడం కష్టం. నిన్నటి నుంచి శ్రీరెడ్డి దిశ మార్చేసింది. ప్రస్తుతం హీరోయిన్ మాధవీలతాపై పడింది. అసలు తనకు సంబంధం లేని వ్యవహారంలో శ్రీ రెడ్డి ఎంటరైంది. మాధవీలతాపై ఫైర్ అయింది. అయితే తాను కూడా తక్కువేమీ తినలేదన్నట్టుగా పరోక్షంగా ఓ సెటైర్ వేసింది. అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైందన్న విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం.
సాధినేని యామినిపై ఫైర్
ఇటీవల సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవి లత.. ఒకప్పుడు మల్లెపూల నలిపే కథలు చెప్పి క్రేజ్ తెచ్చుకున్నవారికి పార్టీలో గుర్తింపు ఇవ్వడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా ద్వారా మండిపడింది.
పవన్ కళ్యాణ్పై కామెంట్స్
గతంలో సాధినేని యామిని పవన్ కళ్యాణ్ను మల్లెపూలు నలపడానికి మాత్రమే పనికొస్తారని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో మాధవీ లతా సాధినేనిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవి లత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
ఆమె గురించి మట్లాడితే తాట తీస్తా..
సాధినేని యామినిపై కామెంట్స్ చేసిన మాధవీలతాపై శ్రీరెడ్డి రెచ్చిపోయింది. 'యామిని సాధినేనికి నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయవలసివస్తుంది' అంటూ శ్రీ రెడ్డి మాధవిలతకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
Recommended Video
కుక్కలు మొరుతూనే ఉంటాయి..
అయితే మాధవీలతా కాసేపటి క్రితం చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయితే అది ఎవరినీ ఉద్దేశించి చేసిందో మాత్రం తెలియడం లేదు. ‘సాధారణం జనాలు మాట్లాడతారు.. తెలివైనవారు వాటిని వింటారు గ్రహిస్తారు.. కుక్కలు మొరుగుతాయి.. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏమంటున్నానో.. నేను చాలా తెలివిగా ప్రవర్తిస్తాను మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో' అంటూ పరోక్ష కామెంట్స్ చేసింది. అయితే నెటిజన్స్ మాత్రం ఇవి శ్రీ రెడ్డికి కౌంటర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.