Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆ హీరోయిన్ అండర్ వేర్ కూడా వదల్లేదు, ఆ మోసగాళ్లు వీరే... (ఫోటోస్)
మేఘనా నాయుడు.... తెలుగు తెరపై ఈ పేరు విని చాలా కాలం అయింది. అప్పట్లో నటిగా, ఐటం గర్ల్గా తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన మేఘనా నాయుడు ఇటీవల జరిగిన ఓ సంఘటనతో షాకైంది. దొంగలు ఆమె ఇంటిని మొత్తం దోచేశారు. చివరకు ఆమె అండర్ గార్మెంట్స్ కూడా వదల్లేదు. ఈ సంఘటన గురించి ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు, తనకు జరిగింది ఎవరికీ జరుగకూడదంటూ..... దొంగల ఫోటోలతో సహా బయట పెట్టింది.
గోవాలో మేఘన నాయుడు ఇల్లు
గోవాలోని కండోలిమ్ ఏరియాలో మేఘనా నాయుడుకు ఇల్లు ఉంది. అక్కడ కేర్ టేకర్ను పెట్టి ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఓ జంట వచ్చి తాము ముంబైకి చెందినవారమని, న్యూజిలాండ్లో వర్క్ చేస్తామని, కొన్ని రోజులు గోవాలో గడిపేందుకు వచ్చామని చెప్పి ఇల్లు రెంటుకు తీసుకున్నారు. అయితే వారు రెంటు ఎగ్గొట్టడంతో పాటు ఇంటిని దోచుకుని వెళ్లడంతో మేఘనా షాకైంది.
మేఘన అండర్ గార్మెంట్స్తో సహా
రెంటు ఎగ్గొట్టి వెళ్లడంతో పాటు ఆ ఇంట్లో కబోర్డుల్లో ఉంచిన మేఘనా నాగయుడుకు చెందిన అండర్ గార్మెంట్స్, సాక్సులు కూడా వదలకుండా అన్ని ఊడ్చుకెళ్లారట.
ఫేక్ ఐడీ కార్డులతో
అద్దెకు దిగే ముందు వారు ఆధార్ ఐడీ కార్డులు చూపించారు. అయితే అవి ఫేక్ ఐడీ కార్డులని దర్యాప్తులో వెల్లడైంది. మేఘనా నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చుట్టుపక్కల వారికి పంగనామాలు
రెంటు ఎగ్గొట్టి వెళ్లే ముందు ఈ జంట చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పంగనామాలు పెట్టారు. మేఘన ఇంటిని చూసుకుంటున్న కేర్ టేకర్ కొడుకును న్యూజిలాండ్ పంపిస్తామని, పేపర్ వర్క్ కోసం అని రూ. 85 వేలు తీసుకున్నారట. దీంతో పాటు మరో లేడీని కూడా రూ. 40 వేలు మోసం చేశారట.
ఫోటో పోస్టు చేసి అలర్ట్ చేసిన మేఘన నాయుడు
తనను మోసం చేసి తన వస్తువులు దోచుకుని వెళ్లిపోయిన వారి ఫోటోలను మేఘనా నాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వారు ఎక్కడనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి, వీరి పట్ల అలర్టుగా ఉండండి అని మేఘనా నాయుడు పేర్కొన్నారు.