Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శర్వానంద్ హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది
హైదరాబాద్: శర్వానంద్ తో 'అందరి బంధువయ' చిత్రంలో హీరోయిన్ గా చేసిన పద్మప్రియ గుర్తుండే ఉంటుంది. ఆమెు ముంబై లో బుధవారం వివాహం జరిగింది. అయితే సినీ పరిశ్రమలో వారిని, మీడియానీ ఎవరినీ పిలవకుండా కేవలం తమ కుటుంబ వేడుకగా సైలెంట్ గా ఈ వివాహం చేసుకుంది. విషయం తెలిసిన ఆమె శ్రేయాభిలాషులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. త్వరలోనే వారికోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ పద్మప్రియ వివాహం ముంబైలో బుధవారం జరిగింది. 'శీను వాసంతి లక్ష్మి', 'అందరి బంధువయ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పద్మప్రియ తన చిరకాల స్నేహితుడు జాస్మిన్ షాని వివాహమాడింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన జాస్మిన్ షాకీ, పద్మప్రియకి అమెరికాలో చదువుకొనేటప్పుడు పరిచయమేర్పడింది. అప్పట్నుంచి స్నేహితులుగా కొనసాగుతున్న వీళ్లు ఓ ఇంటివారయ్యారు.
మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది పద్మప్రియ. మోడల్గా కెరీర్ని ప్రారంభించిన ఆమె హీరోయిన్ గామారి దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, బెంగాలీలోనూ నటించింది. ఓ సినిమాకిగానూ ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుంటానని ఈ సందర్భంగా పద్మప్రియ పేర్కొంది.
న్యూయార్క్ యూనివర్శిటీలో ఇద్దరూ మాస్టర్ డిగ్రీ చేశారు.అప్పటి స్నేహం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది. తెలుగులో ‘శీను వాసంతి' చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన పద్మప్రియ ‘అందరి బంధువయా' చిత్రంలోనూ నటించింది. ఆమె సినీరంగంలో అడుగుపెట్టి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యాయి. దక్షిణాదితో పాటు హిందీ, బెంగాలీ భాషల్లోను కలిసి సుమారు 50 చిత్రాల్లో నటించింది.
గత మూడేళ్లుగా హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన మలయాళ చిత్రం ‘ఐయూబింటె పుస్తకం' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జాస్మిన్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) హెడ్క్వార్టర్స్ జమాల్ అబ్దుల్ లతీఫ్ పోవర్టీ యాక్షన్ ల్యాబ్ సౌత్ ఏసియా పాలసీ హెడ్గా ఉన్నారు.