twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరేష్ తో సహజీవనం వార్తలు.. సైబర్ క్రైమ్ స్టేషన్లో పవిత్ర లోకేష్ ఫిర్యాదు!

    |

    గత కొద్ది రోజులుగా పవిత్ర లోకేష్ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సోదరుడు విజయనిర్మల కుమారుడు అయిన వీకే నరేష్ తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారని త్వరలో వివాహం కూడా చేసుకునే అవకాశం ఉందని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

    కెమెరా కంట పడడంతో

    కెమెరా కంట పడడంతో

    నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ వివాహం చేసుకునే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా తెలుగు మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద నరేష్ నేరుగా స్పందించలేదు కానీ ఆయన పీఆర్ టీమ్ మాత్రం అసంబద్ధమైన వార్తలు అని, ఈ విషయం మీద నరేష్ స్పందించడానికి కూడా ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. అయితే మహాబలేశ్వరంలో ఒక స్వామీజీని కలవడం కోసం వీరిద్దరూ కలిసి జంటగా వెళ్లి కెమెరా కంట పడడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతూ వస్తోంది.

    రమ్య రఘుపతి గురించి

    రమ్య రఘుపతి గురించి

    తాజాగా ఒక కన్నడ మీడియా ఛానల్ తో మాట్లాడిన పవిత్ర లోకేష్ తాను నరేష్ ఇంకా వివాహం చేసుకోలేదని తాము ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నామనే విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం కృష్ణ కుటుంబ సభ్యులకు కూడా తెలుసని వారు కూడా మా రిలేషన్ షిప్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. కృష్ణ గారితో కలిసి కృష్ణ గారి ఫామ్ హౌస్ లోనే తాము నివాసం ఉంటున్నామని ఆమె పేర్కొన్నారు. తనకు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి గురించి తెలుసని ఆమెను గతంలో కొన్నిసార్లు చూశానని ఆమె పేర్కొన్నారు.

     పట్టించుకోవడం లేదంటూ

    పట్టించుకోవడం లేదంటూ

    ఆమె నరేష్ త్గో కలిసి ఉండడానికి ఆమె ఏ మాత్రం ఇష్టపడేది కాదని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ పేర్కొన్నారు. అయితే కృష్ణ కుటుంబ సభ్యులు నుంచి ఆమెకు సపోర్ట్ లభించి ఉండేది కానీ ఆమె అలాంటి వ్యక్తి కావడంతో కృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఆమె గురించి పట్టించుకోవడం లేదంటూ ఆమె కామెంట్ చేశారు.

    ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి

    ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి

    కర్ణాటకకు చెందిన బహుభాషా నటి పవిత్రా లోకేష్ మైసూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తన పేరు మీద చాలా నకిలీ ఖాతాలు క్రియేట్ అయ్యాయని, ఆ ఖాతాల్లో పరువు నష్టం కలిగించే పోస్టులు వచ్చాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తనపై వదంతులు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పవిత్ర లోకేశ్ పేర్కొన్నారు.

    కన్నడ చిత్ర పరిశ్రమలో

    కన్నడ చిత్ర పరిశ్రమలో

    ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్నడ సీనియర్ నటుడు దివంగత మైసూరు లోకేష్ కుమార్తె పవిత్ర లోకేష్ కన్నడ మరియు తెలుగు భాషలలో బుల్లితెరతో పాటు సినిమా నటిగా స్థిరపడింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెండు ఇండస్ట్రీల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మాజీ భర్త అని చెప్పబడుతున్న సుచేంద్ర ప్రసాద్ అలాగే ఆమె సోదరుడు ఆది లోకేష్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో నటులుగా స్థిరపడ్డారు.

    English summary
    actress Pavitra Lokesh lodges complaint with Mysuru Cyber police over fake accounts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X