Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలకృష్ణతో పేకాట ఆడాను.. ఓ సారి అమ్మ కొట్టింది.. సినీ నటి రోజా
షూటింగ్ గ్యాప్లో పేకాట ఆడటం సినీ తారలకు కొత్తేమీ కాదు. పాత తరం నటుల్లో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. సత్యనారాయణ, గిరిబాబు, సూర్యకాంతం తదితర సీనియర్ నటులు షూటింగ్లలో పేకాట ఆడేవారని చెప్పుకొంటారు. లేట
షూటింగ్ గ్యాప్లో పేకాట ఆడటం సినీ తారలకు కొత్తేమీ కాదు. పాత తరం నటుల్లో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. సత్యనారాయణ, గిరిబాబు, సూర్యకాంతం తదితర సీనియర్ నటులు షూటింగ్లలో పేకాట ఆడేవారని చెప్పుకొంటారు. లేటెస్ట్ జనరేషన్కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అందుబాటులోకి రావడంతో మొబైల్ ఫోన్స్లో గేమ్స్ లేదా సోషల్ మీడియాకు పరిమితమయ్యారు. ఇదంతా ఎందుకంటే తాజాగా సినీ నటి, ఎమ్మెల్యే రోజా తన పాత రోజులను ఓ సారి గుర్తు చేసుకొన్నారు. షూటింగ్ గ్యాప్లో తాను పేకాట ఆడేదానిని అని ఇటీవల రోజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
పేకాట కోసం పిలిచిన బాలయ్య
భైరవ ద్వీపం షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ పేకాట ఆడుదామని పిలిచేవాడు. అలా సమయం దొరికితే తామిద్దరం పేకాట ఆడేవాళ్లం. ఆయన సెట్లో ఉంటే పేకాట సందడి కనిపించేది అని రోజా వెల్లడించారు.
సత్యనారాయణతో కూడా
భైరవద్వీపం షూటింగ్లో సీనియర్ నటులు సత్యనారాయణతో కూడా పేకాట ఆడాను. అయితే నేను ఎప్పుడూ డబ్బులు పెట్టి ఆడలేదు. మొదట్లో బాలయ్య ఒత్తిడితో పేకాట ఆడటం నేర్చుకొన్నాను. ఆ తర్వాత మరెవరితో ఆడలేదు అని చెప్పింది
ఓసారి అమ్మ కొట్టింది..
వాస్తవానికి మొదట్లో నాకు పేకాట ఆడటం అంతగా రాకపోయేది. ఓసారి పేకాట ఆడినట్టు తెలిసి ఆ అమ్మ కొట్టింది. కానీ షూటింగ్లో బాలకృష్ణతో పేకాట ఆడటం తప్పలేదు అని రోజా చెప్పుకొచ్చింది.
నేను అలా ఫీల్ కాను
జబర్దస్త్ కామెడీ షో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ కార్యక్రమం ద్వారా మరింత పాపులర్ అయ్యాను. ఒకవేళ నన్ను జబర్దస్త్ రోజా అని పిలిస్తే నేనేమి ఫీల్ కాను. ఎందుకంటే నాకు మంచి గుర్తింపు తెచ్చిన కార్యక్రమం అది కనుక అని రోజా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది.
జబర్దస్త్ అంటే ఆషామాషీ కాదు
జబర్దస్త్ షోను అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. అందుకే అంత పాపులర్ అయింది. ఐదేళ్లుగా షో కొనసాగుతున్నదంటే ఆషామాషీ వ్యవహారం కాదు అని రోజా వ్యాఖ్యానించింది. మల్లెమాల ప్రొడక్షన్ రూపొందించే ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.