Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరంజీవితో అది నా డ్రీమ్, రామ్ చరణ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అనుకున్నా: స్నేహ
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది.
ఈ చిత్రంలో నటి స్నేహ రామ్ చరణ్ పెద్ద వదిన పాత్రలో నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆమె మాట్లాడుతూ... 4 సంవత్సరాల తర్వాత నేను ఈ మూవీ చేస్తున్నాను. ఇది కంబ్యాక్ సినిమాగా చెప్పుకొచ్చు. కంబ్యాక్ ఫిల్మ్ ఇంత పెద్దదిగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.
చిరంజీవితో చేయడం నా డ్రీమ్
ఎన్నో సినిమాలు చేశాను కానీ చిరంజీవిగారితో చేయలేదు. ఆయనతో నటించాలనేది నా డ్రీమ్. అయితే నాకు రామ్ చరణ్తో కలిసి చేసే అవకాశం వచ్చింది. ఇది నాకు దక్కిన గొప్ప అవకాశం అన్నారు స్నేహ.
రామ్ చరణ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అనుకున్నా
రామ్ చరణ్ లాంటి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్తో పని చేయడం ఆనందంగా ఉంది. అతడు స్పాంటేనియస్ యాక్టర్ కూడా. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొదటి రోజు షూటింగుకు వెళ్లినపుడు అతడి బిహేవియర్ ఎలా ఉంటుందో..? అనుకున్నాను. కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అర్థమైందని స్నేహ చెప్పుకొచ్చారు.
బోయపాటిగారు ధైర్యం చెప్పడం వల్లే
బోయపాటిగారు నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నపుడు సరిగా చేయగలనో లేదో అనే నామీ నాకే నమ్మకం లేదు. కానీ ఆయన నువ్వు తప్పకుండా ఈ పాత్ర చేయగలవు అని ధైర్యం చెప్పారు. ఆయన ప్రోత్సాహం వల్లనే ఈ పాత్ర బాగా చేయగలిగాను అన్నారు.
వినయ విధేయ రామ
రామ్చరణ్, కియరా అద్వాని జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్రాజేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మాటలు: యం.రత్నం, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబి, ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఫైట్స్: కనల్ కణ్ణన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్కుమార్, కో ప్రొడ్యూసర్: డి.కల్యాణ్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: బోయపాటి శ్రీను.