Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాగా నీరసించి డాబాపై శ్రీ రెడ్డి.. కరెంట్ లేదు అందుకే అంటూ
Recommended Video
శ్రీ రెడ్డి అంటేనే ఓ సంచలనం. సిగ్గు, బిడియం లాంటి వాటిని తన గడప కూడా తొక్కనీయదు ఈ హాట్ బ్యూటీ. సెక్సువల్ ఇష్యూస్ మాట్లాడటంలో శ్రీ రెడ్డిని మించిన నటి మరొక్కరు లేరనే చెప్పుకోవాలి. అందాలు ఆరబోస్తూ, న్యూడ్ ఫోటోలు పెడుతూ కొందరు నటీమణులు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటుంటే.. అలాంటి వాటి జోలికి పోకుండా కేవలం తన అడల్ట్ కామెంట్స్ తోనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది శ్రీ రెడ్డి. కాగా తాజాగా తన ఫేస్బుక్ ద్వారా శ్రీ రెడ్డి పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల చేత రకరకాల కామెంట్లు పెట్టిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా..
అలా డాబాపై శ్రీ రెడ్డి
ఇన్నిరోజులు సోషల్ మీడియా వేదికగా తోటి నటులు, సినీ పెద్దలపై లైంగిక ఆరోపణలు గుప్పించి సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి.. గత రెండుమూడు రోజులుగా రిలాక్స్ అయింది. అయితే తాజాగా ఈ సారి తన ఫొటోతోనే సంచలనం సృష్టించింది. అది కూడా ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా. అలా రిలాక్స్ అవుతూ డాబాపై నిద్రిస్తున్న పిక్ షేర్ చేసిన శ్రీ రెడ్డి దానిపై ఓ ఇంట్రెస్టింగ్ కాప్షన్ ఇచ్చింది.
పవర్ లేదు.. అందుకే
ప్రస్తుతం శ్రీ రెడ్డి చెన్నైలో ఉంటోంది. అయితే ఆమె ఉండే ఏరియాలో కరెంట్ లేకపోవడంతో డాబా ఎక్కిందట శ్రీ రెడ్డి. ఈ మేరకు సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ''చెన్నైలో నేనుండే ఏరియాలో కరెంట్ పోయింది... 8 గంటలు గడిచినా పవర్ రావడం లేదు. ఇంట్లో బాగా నీరసించిపోయా.. కాస్త సేద తీరుదామని డాబా పైకి వచ్చి ఓ చిన్న కునుకు తీశా'' అని ట్యాగ్ చేసింది.
శ్రీ రెడ్డి ఎదపై పడింది కన్ను..
అసలే బోల్డ్ బ్యూటీ.. పైగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందరి ఆలోచనలు ఒక్కలా ఉండకపోవచ్చు. సరిగ్గా అదే శ్రీ రెడ్డి విషయంలో జరిగింది. ఆమె పోస్ట్ చేసిన తాజాగా ఫొటోలో పడుకొని ఫోజిచ్చింది కాబట్టి.. కొందరు ఫాలోవర్స్ దృష్టి ఆమె ఎదపై పడింది. వెంటనే బోల్డ్ కామెంట్లకు తలుపులు తెరిచి.. నీ నిద్ర సంగతేమో గానీ అందాలు హాట్ హాట్గా ఉన్నాయంటూ కామెంట్లు పెట్టేశారు.
మరింత రెచ్చగొట్టేలా శ్రీరెడ్డి స్పందన
ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చేయకపోయినా తన ఎద అందాలను వర్ణిస్తూ బోల్డ్ కామెంట్లు పెడుతున్న నెటిజన్లను మరింత రెచ్చగొట్టేలా స్పందించింది శ్రీ రెడ్డి. 'మీలో ఎంతమంది నా ఫేస్ని మాత్రమే చూస్తున్నారు?' అంటూ ఓ చింపి ప్రశ్న వేసింది. దీంతో నెటిజన్లు ఓపెన్ అయ్యారు. మరీ ఇలా అడిగేస్తే ఎలా మేడం? అన్నీ బయటకు చెప్పగలమా? అని పేర్కొంటున్నారు.
మరోసారి శ్రీ రెడ్డి ప్రతాపం
గతంలో.. సినీ ఇండస్ట్రీలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా పబ్లిక్గా బట్టలిప్పేసి సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి కొంతకాలంగా చెన్నైలో ఉంటోంది. అయితే కొన్ని రోజులు తన మాటల తూటాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీ రెడ్డి మరోసారి ప్రతాపం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే డైరెక్టర్ తేజ, హీరో విశాల్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.