Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంట్లోనే ఉరి పెట్టుకున్న నటుడు.. ఆత్మహత్య.. ఆస్తి వాళ్ళకే అంటూ నోట్
బుల్లితెర నటుడు కుశాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. హిందీ సీరియల్స్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవడం తెలిసి షాక్ అయ్యారు జనం.
అయితే కుశాల్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నిర్థారించారు. సూసైడ్ నోట్ లో తన చావుకు ఎవరూ బాధ్యులు కారు అని పేర్కొంటూ తన ఆస్తిని తల్లిదండ్రులు, కుమారుడికి సమానంగా పంచండి అని తెలిపాడు. అయితే ఆయన బలవన్మరణానికి కారణం వ్యక్తిగత, వృతిపరమైన సమస్యలేవైనా అయి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.

కుశాల్ పంజాబీ హఠాన్మరణం చెందినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ, కుశాల్ స్నేహితుడు, నటుడు కరణ్వీర్ బోహ్రా ఆయన ఆత్మహత్య విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం తెలిసింది. కుశాల్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు.
కుశాల్ మృతిపై గాయకుడు బాబా సెహగల్ విచారం వ్యక్తం చేశాడు. 'కుశాల్ లేడంటే నమ్మలేకపోతున్నాను. సవాళ్లను ఎదుర్కునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తను ఓ మంచి తండ్రి. నా తమ్ముడి వంటి నీ ఆత్మకు శాంతి చేకూరాలి కుశాల్' అని ట్వీట్ చేశాడు.