Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జాతీయ అవార్డు రేసులో పవన్, మహేష్, ప్రభాస్ మూవీస్
హైదరాబాద్: 61 సినిమా జాతీయ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు నుండి మొత్తం దాదాపు 20 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈలిస్టులో పెద్ద సినిమాలు మూడు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది', మహేష్-వెంకీ మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రాలు పోటీ పడుతున్నారు. వీటితో పాటు ప్రేమ కథా చిత్రం, కమలతో నా ప్రయాణం, అంతకు ముందు ఆ తరువాత చిత్రాలు ఉన్నాయి.
అద్భుత సినీ రంగం, అమ్మా నీకు వందనం, ఓ మల్లి, పరంపర, ప్రణయ వీధిలో పోరాడే ప్రిన్స్, ది క్లూ, యుగ్మలి..... లాంటి ప్రేక్షకులు అసలు పరిచయమే లేని చిత్రాలు కూడా ఉన్నాయి. రిలీజ్ సమస్య కారణంగానో, పబ్లిసిటీ చేయని కారణంగానో ప్రచారంలోకి రాలేదు. ఏది ఏమైనా ఇవి కూడా మన తెలుగులో తెరకెక్కిన సినిమాలే.
సినిమా రంగానికి సంబంధించిన జాతీయ అవార్డులను మే 3న ప్రకటించనున్నారు. మొత్తం 27 బాషల నుండి 310 సినిమాలు పోటీ పడుతున్నాయి. మొత్తం 30 కేటగిరీలలలో అవార్డుల ప్రధానం చేయనున్నారు. గత సంవత్సరం తెలుగు నుండి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం రెండు జాతీయ అవార్డులను దక్కించుకుంది.
ఈ సంవత్సరం తెలుగు నుండి ఏయే చిత్రాలకు అవార్డులు దక్కుతాయనే అంశం చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా అవార్డు అందుకోబోతోంది, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో ఎవరు అవార్డులు అందుకోబోతున్నారు అనేది చర్చనీయాంశం అయింది.