Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వీళ్ళు ఫ్యాన్సా?: చుట్టుముట్టి ఆదాశర్మ ని టచ్ చేయాలని...
హైదరాబాద్ : సమంత, తాప్సీ, హెబ్బా పటేల్ ఈ మధ్యకాలంలో ప్రెవేట్ ఈవెంట్స్ లో చుట్టూ మూగిన అభిమానులమటూ మూగిన జనంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యే అదాశర్మకు ఎదురైంది. తన తాజా చిత్రం క్షణం ప్రమేషన్ కోసం షాపింగ్ మాల్ కు వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.
దాదాపు ఇరవై మంది సెక్యూరిటీ ఉన్నా చుట్టూ చేరిన జనాలని కంట్రోలు చేయలేకపోయారు. చాలా మందిని ఆమె దగ్గరగా వెళ్లాలని ముట్టుకోవాలని ఆత్రతపడటంతో ఆమె ఇబ్బందుల్లో పడింది. కొందరైతే అంతపనీ చేసారు. ఈ సంఘటనతో కంగారు పడ్డ అదా శర్మ ..వెంటనే ఎయిర్ పోర్ట్ కు వచ్చి హైదరాబాద్ ప్లైట్ ఎక్కేసింది.
హార్ట్ ఎటాక్ చిత్రంతో పరిచయమై, రీసెంట్ గా గరం, క్షణం చిత్రాలతో పలకరించిన భామ అదాశర్మ. అదాశర్మ నటించిన క్షణం చిత్రం మంచి సక్సెస్ కాగా ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకనేందుకు విజయవాడలోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లింది. ఇక విజయవాడ వెల్లబోయే విషయాన్ని ముందుగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఆదా.
See u at Vijaywada PVP mall today evening !!💖💖💖💖💖💖 pic.twitter.com/Vnl1crSfTQ
— Adah Sharma (@adah_sharma) February 28, 2016
ఆదాశర్మ వస్తుందని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరుకోవటమే సమస్యగా మారింది. అటువంటి పరిస్ధితుల్లోనూ ఆదా అభిమానులతో అలాగే కాసేపు సందడి చేయగా తిరుగు ప్రయాణంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొందట. ఆదాను కలిసేందుకు కొందరు జనాలు ఆమె మీదకు దూసుకు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయలేక సెక్యూరిటీ చేతులు ఎత్తేయటమే సమస్యగా మారిందని చెప్తున్నారు.