Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సందడి లేకుండానే...బాలయ్య‘అధినాయకుడు’ ఆడియో
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అధినాయకుడు'. లక్షీరాయ్, సలోని ఇందులో కథానాయికలు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత కుమార్ చౌదరి మాట్లాడుతూ....''ఈ నెల 8న ఆడియోను డైరెక్టుగా మార్కెట్ లోకి ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నాం. పాటలు ఎక్స్ట్రార్టినరీగా వచ్చాయి. బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా కళ్యాణిమాలిక్ అద్భుతంగా స్వరాలందించారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది'' అని తెలిపారు.
దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ ''బాలకృష్ణ ఇమేజ్ ను, బాడీలాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. ఆయన అభిమానులను రంజింపచేసే అన్ని అంశాలకు ఇందులో పెద్ద పీట వేస్తున్నాం. బాలయ్య నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్, వినోదం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి'' అని చెప్పారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరాa: సురేందర్ రెడ్డి, సంగీతం: కళ్యాణి మాలిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.