‘అధినాయకుడు’లో విగ్రహాల డైలాగ్ పెట్టడాని కారణం ఇదే...

By Bojja Kumar

'అధినాయకుడు' చిత్రం విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్‌లో 'మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలేగానీ...రోడ్డుమీద విగ్రహాల్లో కాదు. ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు చేస్తున్నావో చెబుతావా, చెప్పించమంటావా' అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ను టార్గెట్ చేస్తున్నట్లు ఉండటంతో ఆ పార్టీ వారు సినిమాను ఉప ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేయాలని ఫిర్యాదు చేశారు కూడా.

అసలు ఈ డైలాగ్ ఎందుకు పెట్టారంటే...
హరిశ్చంద్ర ప్రసాద్(వృద్ధ గెటప్ బాలయ్య) లాంటి మంచి నాయకుడు చనిపోవడంతో అతిని విగ్రహం కర్నూలు నడి ఒడ్డున పెట్టేందుకు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటూ విలన్ కోట వచ్చి చెబుతాడు. కోట ఈ విగ్రహం పెట్టే ప్లాన్ ఎందుకు వేస్తాడంటే అతని మనుషులను మచ్చిక చేసుకోవడానికి. ఇది నచ్చని రామకృష్ణ ప్రసాద్......'మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలేగానీ...రోడ్డుమీద విగ్రహాల్లో కాదు. ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు చేస్తున్నావో చెబుతావా, చెప్పించమంటావా' అడే డైలాగ్ కొడతాడు.

పరుచూరి మురళి దర్శకత్వం వహించిన 'అధినాయకుడు' చిత్రాన్ని ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. బాలయ్య ఈ చిత్రంలో మూడు గెటప్స్‌ పోషించారు. హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో అదగరొట్టగా...రామకృష్ణ ప్రసాద్ గెటప్ అతుకుల గడ్డం సెట్ కాలేదు. కిల్లర్ కిట్టుగా బాలయ్య చేసే డాన్సులు భరించడం కాస్త కష్టమే.

బాలయ్య సరసన లక్ష్మిరాయ్ మెయిన్ హీరోయిన్‌గా నటించింది. లక్ష్మిరాయ్ ఓ పాటలో గెస్ట్‌రోల్లో తళుక్కుమంది. ఈ చిత్రానికి కథ: పరుచూరి మురళి, సంగీతం: కళ్యాణి మాలిక్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X