Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘అధినాయకుడు’ రిలీజ్పై మరో రూమర్
బాలయ్య 'అధినాయకుడు' సినిమా విడుదలపై రూమర్ల మీదన రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సినిమా నిర్మాత కుమార్ చౌదరి ఆర్థిక ఇబ్బందుల్లో పడి సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కుమార్ చౌదరికి అప్పు ఇచ్చిన వారంతా అప్పతీర్చనిదే విడుదల చేయనీయబోమంటూ అడ్డుపడుతున్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కుమార్ చౌదరికి అప్పు ఇచ్చిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఉన్నట్లు సమాచారం.
తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న రూమర్లను బట్టి నిర్మాత కుమార్ చౌదరికి, అప్పు ఇచ్చిన వారికి మధ్య ఒప్పందం కుదిరిందని, ఇటీవలే దర్శకరత్న దాసరి సమక్షంలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందని తెలుస్తోంది. ఈ మేరకు మే 31న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ఈ చిత్రంలో బాలయ్య కెరీర్లోనే తొలి సారిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సలోని, లక్ష్మి రాయ్ బాలయ్యతో రొమాన్స్ చేయనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కళ్యాణి మాణిక్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ప్రస్తుతం బాలయ్య రవి చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.