twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అధినాయకుడు’ రిలీజ్‌పై మరో రూమర్

    By Bojja Kumar
    |

    బాలయ్య 'అధినాయకుడు' సినిమా విడుదలపై రూమర్ల మీదన రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సినిమా నిర్మాత కుమార్ చౌదరి ఆర్థిక ఇబ్బందుల్లో పడి సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కుమార్ చౌదరికి అప్పు ఇచ్చిన వారంతా అప్పతీర్చనిదే విడుదల చేయనీయబోమంటూ అడ్డుపడుతున్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కుమార్ చౌదరికి అప్పు ఇచ్చిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఉన్నట్లు సమాచారం.

    తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న రూమర్లను బట్టి నిర్మాత కుమార్ చౌదరికి, అప్పు ఇచ్చిన వారికి మధ్య ఒప్పందం కుదిరిందని, ఇటీవలే దర్శకరత్న దాసరి సమక్షంలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందని తెలుస్తోంది. ఈ మేరకు మే 31న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

    ఈ చిత్రంలో బాలయ్య కెరీర్లోనే తొలి సారిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సలోని, లక్ష్మి రాయ్ బాలయ్యతో రొమాన్స్ చేయనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కళ్యాణి మాణిక్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

    ప్రస్తుతం బాలయ్య రవి చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    English summary
    As per the latest reports available, Nandamuri Balakrishna’s film ‘Adhinayakudu’ is finally gearing up to hit the screens on the 31st of May. Saloni and Lakshmi Rai are the heroines in this movie Balakrishna will be seen in three powerful roles. Paruchuri Murali has directed the film and Kalyani Malik has scored the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X