Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు నిర్మాతగా క్రేజీ ప్రాజెక్ట్.. 26/11 ముంబై దాడులు, హీరో ఎవరో తెలుసా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వ్యాపారంగంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాను నటించే చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్ కూడా ప్రారంభించాడు. తాజాగా సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించిన మహేష్ పూర్తి స్థాయిలో సినిమాలని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు. మహేష్ బాబు కో ప్రొడ్యూసర్ గా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం అయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!
మహేష్ సహ నిర్మాతగా
మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. ఆ బ్యానర్ పేరు జి మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్. ఈ బ్యానర్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం అయింది. గూఢచారి చిత్రంతో అందరిని ఆకర్షించిన అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మేజర్ అనే టైటిల్ ఖరారు చేసి తాజగా ప్రీ లుక్ విడుదల చేశారు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు.
26/11 ముంబై దాడులు
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. మేజర్ చిత్రం 26/11 ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కబోతోంది. 2008లో పాక్ ఉగ్రవాదులు అక్రమంగా ముంబైలోకి చొరబడి నవంబర్ 26న మారణకాండ సృష్టించిన సంగతి తెలిసిందే. వందలాది మంది భారత పౌరులు ఈ ఘటనలో మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల చెరలో బంధీలుగా మారిన మరికొంత మంది పౌరులని జవానులు మిలటరీ ఆపరేషన్ ద్వారా రక్షించారు.
మేజర్ ఉన్నికృష్ణన్
ఈ ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల నుంచి ప్రజల్ని రక్షించే క్రమంలో ఉన్నికృష్ణన్ బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటించబోతున్నాడు. గూఢచారి తర్వాత అడవిశేష్ నుంచి రాబోతున్న మరో యాక్షన్ చిత్రం ఇది.
తెలుగు, హిందీ భాషల్లో
తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నారు. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహేష్ బాబు సహ నిర్మాత కావడంతో మేజర్ పై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. త్వరలో త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో నటించడం నా డ్రీమ్ అని అడవి శేష్ తెలిపాడు. మేజర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.