Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అయ్యో పాపం.. విజయ్ గొంతు నొక్కిన సెన్సార్.. అదిరిందిలో ఆ డైలాగ్స్ కట్..
తమిళంలో అనేక వివాదాలు చుట్టుముట్టిన మెర్సల్ చిత్రం తెలుగులో అదిరింది పేరుతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Recommended Video
తమిళంలో అనేక వివాదాలు చుట్టుముట్టిన మెర్సల్ చిత్రం తెలుగులో అదిరింది పేరుతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో డిజిటల్ ఇండియా, జీఎస్టీపై హీరో విజయ్ చెప్పిన డైలాగ్స్ అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఈ డైలాగ్స్ను తొలగించాలని తమిళనాడులో పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అదిరింది చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వివాదాస్పద డైలాగ్స్ ఇవే...
ఎన్నికల సమయంలో ఓటర్లకు ఫ్రిజ్లు, మిక్సీలు, టెలివిజన్లు, బంగారం, డబ్బు లాంటి వస్తువులను పంచే మన దేశంలో రోగులకు ఉచితంగా వైద్యం, ట్యాబ్లెట్లు ఇవ్వలేమా? అని విజయ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
ఓట్ల బాక్సుల మాత్రమే
ఎన్నికల సమయంలోనే ఓట్ల బాక్సులు గ్రామాల్లోకి వస్తాయి. ఎలక్షన్లలో ప్రజలకు ఆశ పెడుతారు నాయకులు. ఎన్నికల తర్వాత మాత్రం నాయకుల వెనుక ప్రజలంతా పరుగెత్తాల్సిందే. గ్రామాల్లో కనీస వసతులు లేవు. వైద్య సౌకర్యాలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అనే డైలాగ్స్ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించేలా ఉన్నాయి.
డిజిటల్ పేరుతో నాకేస్తున్నారు
డిజిటిల్ ఇండియా పేరుతో డబ్బులను అంతా నాకేస్తుంటే.. ఎక్కడైనా జేబులో డబ్బులు ఉంటాయా? అని వడివేలు సెటైర్ వేస్తాడు.
ఉచిత వైద్యం అందించలేమా?
రోగులకు అన్యాయం చేస్తున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని చంపడం అనేది కథలో భాగం. ఈ అంశంపై ఏ లక్ష్యంతో వారిని చంపావు అనే ప్రశ్నకు సమాధానంగా ఉచిత వైద్యం అని సమాధానం చెబుతాడు.
మద్యంపై జీఎస్టీ ఉండదా?
సింగపూర్లో వైద్య చికిత్సపై జీఎస్టీ పన్ను 7 శాతం. మన దేశంలో జీఎస్టీ 28వ శాతం. కానీ సింగపూర్లో ఉచితంగా మందులు ఇస్తారు. కానీ మన దేశంలో మందులపై అదనంగా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఇది న్యాయామా అని హీరో విజయ్ ప్రశ్నిస్తాడు. ప్రజల ఆరోగ్యంపై దెబ్బ తీసే మద్యంపై మాత్రం పన్ను విధించరు అని ప్రభుత్వాల తీరును చీల్చి చెండాడుతారు.
డైలాగ్స్పై సెన్సార్
అదిరింది చిత్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జీఎస్టీ, డిజిటల్ ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ను ప్రేక్షకులకు వినిపించకుండా సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. ఈ డైలాగ్స్ వినిపించకపోవడంపై ప్రేక్షకులు థియేటర్ల అసహనంతో కేకలు వేయడం స్పష్టంగా వినిపించింది.