Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కిరాతకంగా కమెడియన్ హత్య... వెన్నులో చలి పుట్టించేంతలా దారుణమైన మర్డర్
అఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో జరిగిన కమెడియన్ నాజర్ మహ్మద్ దారుణ హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. కమెడియన్గా రాణిస్తున్న నాజర్ గతంలో పోలీసు ఫోర్స్లో సేవలందించారు. అయితే మంగళవారం ఆయనను ఇంటి నుంచి తీసుకెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కమెడియన్ నాజర్ హత్యను స్థానిక మీడియా వెలుగులోకి తెచ్చింది. అతన్ని చంపిన విధానం వెన్నులో చలిపుట్టించేంతగా అతి కిరాతకంగా చంపారని తమ కథనాల్లో పేర్కొన్నారు.
నాజర్ మహ్మద్ హత్యకు తాలిబాన్ టెర్రరిస్టులే కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే నాజర్ మహ్మద్ హత్యకు తాము కారణం కాదు. ఆయన హత్యలే మా ప్రమేయం ఏమీ లేదు అని తాలిబన్ గ్రూప్ ఖండించింది.
కొద్ది రోజులుగా అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు, అఫ్ఘన్ సెక్యూరిటీ ఫోర్సెస్కు మద్య తీవ్ర పోరాటం జరుగుతున్నది. ఆఫ్ఘనిస్థాన్ను 70 శాతం వశపరుచుకొన్నామని అఫ్ఘన్ సెక్యూరిటీ దళాలు ప్రకటన చేసిన నేపథ్యంలో నాజర్ మహ్మద్ హత్యా ఘటన చోటుచేసుకొన్నది.
అఫ్ఘనిస్థాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం శరణార్థ క్యాంపులను ఏర్పాటు చేసింది. యుద్ధ మేఘాలు కమ్ముకొన్న నేపథ్యంలో ప్రజలంతా అందులో తలదాచుకొంటున్నారు. అలా తలదాచుకొంటున్న ప్రజలకు బ్రేక్ఫాస్ట్; రెండు పూటల భోజనం అందజేస్తున్నాం అని ప్రజా ప్రతినిధులు పార్లమెంట్లో ఇటీవల వెల్లడించారు.