Don't Miss!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకొన్న శ్రీదేవి
సుమారు రెండు దశాబ్దాల పాటు తన అందచందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శ్రీదేవి, పదిహేను సంవత్సరాల తర్వాత నిన్న మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఆమె తాజాగా నటిస్తున్న'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా షూటింగ్ ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో ప్రారంభమైంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ బాల్కీ భార్య గౌరీ షిండే దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
చాలా కాలం తర్వాత మళ్లీ తను నటిస్తుండడంతో శ్రీదేవి భర్త బోనీకపూర్, ఫిలిం మేకర్ బాల్కీ కూడా స్టూడియోలో ఆమె చెంత వున్నారు. అలాగే, బాలీవుడ్ ప్రముఖుడు యష్ చోప్రా, అతని తనయుడు ఆదిత్య చోప్రా కూడా స్టూడియోకొచ్చి శ్రీదేవిని కలిశారు. చాలా కాలం తర్వాత సొంతింటికి వచ్చిన దానిలా శ్రీదేవి ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించింది. తను మళ్లీ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేస్తుందని ఆమె భర్త బోనీకపూర్ ఈ సందర్భంగా నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.