Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
17 ఏళ్ల తర్వాత చిరంజీవి ట్రెండ్ సెట్ చేయబోతున్నారా?
చిరంజీవి తన కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. వరుస హిట్లతో టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగారు. అయితే 2007లో 'శంకర్ దాదా జిందాబాద్' తర్వాత సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత 2017లో వచ్చిన 'ఖైదీ నెం.150' తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
80, 90ల్లో చిరంజీవి ఎన్నో బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. అయితే 2000 సంవత్సం తర్వాత కూడా ఆయన నుంచి హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ అందులో చాలా వరకు ఇతర భాషల్లో హిట్టయిన రీమేక్ చిత్రాలే ఉన్నాయి. 'ఇంద్ర' మాత్రమే తెలుగులో తయారైన కథ.
17 ఏళ్లుగా ఒక్కటీ లేదు
త్వరలో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉందట. గడిచిన 17 సంవత్సరాల్లో చిరంజీవి స్ట్రైట్ తెలుగు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ‘సైరా' స్ట్రైట్ తెలుగు సినిమాతో విజయం అందుకోబోతున్నట్లు, ట్రెండ్ సెట్ చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.
హిట్స్ ఉన్నాయి కానీ, రీమేక్ చిత్రాలే
2000 సంవత్సరం తర్వాత ఆయన ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు చేశారు. ఇందులో ఇంద్ర తప్ప అన్నీ తమిళం, హిందీ రీమేక్ చిత్రాలే. 2002లో ‘ఇంద్ర' విడుదలైంది. ఆ తర్వాత ఆయన చేసిన స్ట్రైట్ తెలుగు చిత్రాలు ఆడలేదు. రీమేక్ మూవీస్ మాత్రమే విజయం సాధించాయి.
సైరా మూవీ హాట్ టాపిక్
చిరంజీవి నటించిన రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం 150'... బ్లాక్ బస్టర్ మూవీ అయినప్పటికీ ఇది తమిళ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్ట్రైట్ తెలుగు సినిమాగా రూపొందుతున్న ‘సైరా' హాట్ టాపిక్ అవుతోంది.
పూర్తి నమ్మకంతో సైరా టీం
‘సైరా' చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరంజీవితో పాటు దర్శక నిర్మాతలు ఈ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇది మెగాస్టార్ కెరీర్లో డ్రీమ్ ప్రాజెక్ట్. అతిపెద్ద బడ్జెట్ మూవీ కూడా. ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల రాబోతోంది.