Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
30 ఏళ్ల క్రితం తల్లీకొడుకులుగా, ఇప్పుడెంటో.. మహేష్తో సినిమాలో క్రేజీ హీరోయిన్!
మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించేశారు. దీనితో మహేష్ తదుపరి చిత్రాలపై కసరత్తులు మొదలైపోయాయి. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రం కోసం అనిల్ రావిపూడి హీరోయిన్లు, ఇతర కీలక పాత్రల కోసం అనిల్ రావిపూడి క్రేజీ నటుల్ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
30 ఏళ్ల క్రితం
సూపర్ స్టార్ కృష్ణ, విజయ శాంతి జంటగా నటించిన కొడుకు దిద్దిన కాపురం చిత్రం 1989లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో విజయశాంతి, మహేష్ తల్లీకొడుకులు నటించారు. మహేష్ ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి నటన కనబరిచాడు. ఆ తర్వాత మహేష్, విజయశాంతి మరో చిత్రంలో నటించలేదు. 30 ఏళ్ల తర్వాత వీరిద్దరిని ఒకే ప్రేములో వెండి తెరపై చూడబోయే అవకాశం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కీలక పాత్రలో
మహర్షి చిత్రం తర్వాత అనిల్ రావిపూడి దర్శత్వంలో మహేష్ బాబు నటించబోతున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం అనిల్ రావిపూడి కొంతమంది క్రేజీ నటుల్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అనిల్ రావిపూడి విజయశాంతిని కలసినట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ 2 చిత్రంలో ఘనవిజయం తర్వాత అనిల్ రావిపూడి టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు.
అఖిల్ హీరోయిన్ పెళ్లి.. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్లో .. సంజయ్ దత్ స్పెషల్ ఎట్రాక్షన్!
యంగ్ హీరోయిన్స్
ఈ చిత్రంలో మహేష్ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కూడా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహర్షి చిత్ర చిత్రీకరణ చివరిదశలో ఉంది. మహర్షి చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి దిల్ రాజే నిర్మాత. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్త నిర్మాణంలో ఈచిత్రం తెరకెక్కుతోంది.
రద్దయిన క్రేజీ ప్రాజెక్ట్
వాస్తవానికి మహర్షి చిత్రం తర్వాత మహేష్ సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ చిత్రంలో నటించడం లేదు అంటూ మహేష్ ప్రకటించాడు. దీనితో సుకుమార్ అల్లు అర్జున్తో ఓ చిత్రానికి రెడీ అవుతున్నాడు. తొలిసారి మహేష్ లాంటి సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేసే అవకావం దక్కించుకున్న అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.