Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఇద్దరు పిల్లల తల్లిని అయినా కూడా వేధించాడు.. నటుడిపై సింగర్ సంచలన ఆరోపణ!
పాకిస్తాన్ యువ నటుడు అలీ జాఫర్ బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. అతడిపై సింగర్ మిషా షఫీ (36) సంచలన ఆరోపణలు చేసింది. అలీ జాఫర్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణ చేసింది. తాను ఇద్దరు పిల్లల తల్లిని అని కూడా చూడకుండా తనని తాకరాని చోట తాకుతూ వేదనకు గురిచేశాడని మిషా ఆరోపించింది. ఈ ఆరోపణలు చేస్తూ ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
దీనిపై నటుడు అలీ జాఫర్ స్పందించారు. మీ టూ ఉద్యమానికి తన మద్దత్తు ఉంటుందని తెలిపాడు. కానీ తాను ఓ పాపకు తండ్రిని అని, తన గురించి స్నేహితులకు, మిత్రులకు బాగా తెలుసు అని అలీ జాఫర్ అన్నాడు. కానీ తన గురించి ఇలాంటి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని జాఫర్ వివరించాడు. అందుకే ఆమెపై న్యాయపరమైన పోరాటానికి దిగుతున్నానని ఆమెకి నోటీసులు పంపించడం విశేషం.
అలీ జాఫర్ పాక్ లో పలుచిత్రాల్లో నటించాడు. బాలీవుడ్ లో కూడా అతడు తేరె బిన్ లాడెన్, మేరీ బ్రదర్ కి దుల్హన్ వంటి చిత్రాల్లో నటించడం విశేషం. ప్రస్తుతం అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.