Don't Miss!
- News Arvind kejriwal నేడు కోర్టులో బాంబు పేల్చనున్నారా? సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!!
- Sports SRH vs MI: హార్దిక్ వల్లే ఓటమి.. చెత్త కెప్టెన్సీ - మాజీ క్రికెటర్లు
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
కార్తీ తర్వాత తెలుగులో మార్కెట్ పెంచకొంటున్న జీవా
కార్తీ తర్వాత మరో తమిళ హీరో తెలుగులో మెల్లిగా మార్కెట్ పెంచుకుంటున్నాడు. అతనే జీవా! ఇటీవల 'రంగం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జీవా, త్వరలో మరో సినిమాతో టాలీవుడ్ కి వస్తున్నాడు. ఇంతవరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని సూపర్గుడ్ ఫిలింస్ పతాకంపై అందించిన నిర్మాత ఆర్.బి. చౌదరి తన తనయుడు కథానాయకుడిగా నటించిన 'రంగం"ని తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన తన తనయుడు నటించిన మరో చిత్రాన్ని 'రౌద్రం" పేరుతో అందిస్తున్నారు. జీవా తమిళంలో నటిస్తున్న 'రౌదిరం' చిత్రాన్ని తెలుగులోకి 'రౌద్రం' పేరుతో డబ్ చేస్తున్నారు. ఇందులో శ్రియా అతని పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జీవా తండ్రి, ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. గోకుల్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంచితే, జీవా నటించిన 'రంగం' సినిమా ఇప్పటికి 75 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో ఈ 'రంగం' సినిమా శతదినోత్సవాన్ని జరుపుతామని నిర్మాత ఆర్.బి.చౌదరి చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ' మా అబ్బాయి జీవా కథానాయకుడిగా ఇటీవలే మేము విడుదల చేసిన 'రంగం" చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేసినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఈ చిత్ర శతదినోత్సవాన్ని ఆగస్టులో జరపాలని ప్లాన్ చేస్తున్నాం. ఈచిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నాం. మాసంస్థ నుంచి వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల ఏ ఆంశాలు ఆశిస్తారో ఆ ఆంశాలన్నీ వుంటూ అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేకథతో కమర్షియల్ విలువల్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి.ఆగస్టు మొదటి వారంలో ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నాం" అన్నారు. ప్రకాష్రాజ్, జె.పి.లక్ష్మీరామకృష్ణ, మోనిక, చైతన్యకృష్ణ, గణేష్, ఆచార్య, బాబ్ ఆంటోనీ తదితరులు ముఖ్యపావూతలు పోవిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రకాష్ విక్కి, కెమెరా: షణ్ముగ సుందరం, కళ: యస్.శివరాజ్.