twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీ కాంబినేషన్.. ప్రభాస్‌కు హీరోయిన్‌ని సెట్ చేసిన దిల్ రాజు!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయి బాహుబలి తర్వాత మారిపోయింది. అప్పటి వరకు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ గా ఉన్న ప్రభాస్ బాహుబలితో బాలీవుడ్ హీరోలతో పోటీ పడే రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు వందల కోట్ల బిజినెస్ తో కూడుకున్నవి. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జోడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ రెండు చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. సాహో చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా ఓ క్రేజీ కాంబినేషన్ లో ప్రభాస్ చిత్రం ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.

     క్రేజీ కాంబినేషన్

    క్రేజీ కాంబినేషన్

    తాజా సమాచారం మేరకు ప్రభాస్, సమంత కలసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో అత్యధిక శాతం సక్సెస్ రేట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. తెలుగు తమిళ భాషల్లో పలువురి స్టార్ హీరోలతో సమంత నటించింది. ఆమె నటించిన చిత్రాలలో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినవి కూడా ఉన్నాయి. మెర్సల్, రంగస్థలం, కత్తి లాంటి చిత్రాలు 100 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

     దిల్ రాజు నిర్మాణంలో

    దిల్ రాజు నిర్మాణంలో

    ప్రభాస్ కు హీరోయిన్ గా సమంతని ఎంపిక చేసింది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన వద్ద ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడే అద్భుతమైన కథ ఉన్నట్లు తెలుస్తోంది. 96 రీమేక్ కోసం సమంతని కలసినప్పుడే దిల్ రాజు ప్రభాస్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాడట. దీనికి సమంత ఓకె చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సమంత ఇప్పటివరకు ప్రభాస్ సరసన నటించలేదు. మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

     దర్శకుడు ఎవరు

    దర్శకుడు ఎవరు

    తన వద్ద ఉన్న కథని అనుకున్న విధంగా తెరకెక్కించగలిగితే అద్భుత విజయం సాధిస్తుందని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ కథని హ్యాండిల్ చేయగలిగే దర్శకుడి కోసం దిల్ రాజు వెతుకుతున్నారట. బహుశా 2020లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. రాబోవు రోజుల్లో ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

    రెండు చిత్రాలతో బిజీగా

    రెండు చిత్రాలతో బిజీగా

    ప్రభాస్ ప్రస్తుతం సాహో, రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కే చిత్రంతో బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శత్వంలోని చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెడతాడు. దిల్ రాజు మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, ప్రభాస్ కాంబినేషన్ లో 2007లో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు వచ్చాయి. మున్నా నిరాశపరిచినా, మిస్టర్ పర్ఫెక్ట్ విజయాన్ని అందుకుంది.

    English summary
    After Munna and Mr Perfect Dil Raju to produce one more movie with Prabhas
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X