Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
రెట్టించిన ఉత్సాహంతో రాంచరణ్.. క్రేజీ ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో బిగ్గిస్ట్ హిట్ దిశగా సాగుతోంది. రాంచరణ్ కెరీర్ బెస్ట్ వసూళ్ళని ఈ చిత్రం సాధిస్తోంది. నటుడిగా ఈ చిత్రంతో రాంచరణ్ చాలా పెద్ద ఘనతే సాధించాడు. వినికిడి లోపంతో రాంచరణ్ చిట్టిబాబుగా నటించిన నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
రంగస్థలం చిత్రం అందించిన ఉత్సాహంతో రాంచరణ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. రంగస్థలం చితం విడుదలై ఘనవిజయం సాధించింది. చరణ్, బోయపాటి చిత్రం రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతునట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.