సన్నీలియోన్ అడుగుజాడల్లో దిశాపటానీ.. తప్పదు మరీ..
ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో దుమ్ము రేపుతున్న దిశా పటానీ తాజాగా తన పేరు మీద మొబైల్ యాప్ను ప్రారంభించింది.
ట్రెండ్ను ఫాలో కావడంలోనూ, టెక్నాలజీ వినియోగంలోనూ బాలీవుడ్ తారలు ఒక్క అడుగు ముందే ఉంటారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో దుమ్ము రేపుతున్న దిశా పటానీ తాజాగా తన పేరు మీద మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఎంఎస్ ధోని చిత్రంతో బాలీవుడ్లో పాపులరైనా ఇప్పటివరకు ఆమె జాబితాల సరైన హిట్ చేరలేదు. కానీ సోషల్ మీడియా వినియోగంలో దూసుకు పోతున్నది.

సన్నీలియోన్ బాటలో..
ఇప్పటికే బాలీవుడ్లో సోనమ్ కపూర్, సన్నిలియోన్, అమీ జాక్సన్, కాజల్ అగర్వాల్, సూరజ్ పంచోలి లాంటి కుర్ర తారలు సొంతంగా యాప్లను ఏర్పాటు చేసుకొన్నారు. యాప్ల ద్వారా అభిమానులతో అనుసంధానవుతున్నారు. తాజాగా వీరి జాబితాలో దిశా కూడా చేరింది.

సోషల్ మీడియాలో హల్చల్
యూత్లో దిశా పటానీకి మంచి క్రేజ్ ఉన్నది. దీని దృష్టిలో పెట్టుకొన్న ఆమె అభిమానులను ఖుషీ చేయడానికి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. యూత్ టార్గెట్ చేసుకొని ఈ యాప్ను రూపొందించినట్టు తెలిపారు.

అద్భుతమైన ఫీచర్స్తో...
అద్భుతమైన ఫీచర్స్తో సొంతంగా యాప్ను రూపొందించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి యాప్ ద్వారా అభిమానులకు చేరువ అవుతా. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియాతో ఇంకా ఎక్కువ టచ్లో ఉంటానని దిశా పటానీ తెలిపింది.

దిశాపటానీకి కండోమ్స్ పూజలు
దిశాపటానీకి యూత్లో ఎంత క్రేజ్ ఉన్నదంటే ఇటీవల ఢిల్లీలో వినూత్నంగా పూజ చేశారు. వాలంటైన్ డేను పురస్కరించుకొని ో కళాశాలలో విద్యార్థులు లవ్ ట్రీకి దిశా పటానీ ఫొటోలు పెట్టి కండోమ్స్తో పూజ నిర్వహించారు. శీలం పోయేలా చూడు తల్లీ అంటూ వర్జిన్ ట్రీకి పూజలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.


Click it and Unblock the Notifications











