Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాంచరణ్ నో.. మెగాస్టార్ చిరంజీవి ఒకే.. సెన్సేషనల్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్!
Recommended Video
సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ నటించబోయే చిత్రం ఏమిటనే అంశంపై సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిత్రం వచ్చి ఏడాదికిపైగా పూర్తయింది. సైరా రిలీజ్ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. సైరా పూర్తి చేయడానికి ముందే చిరంజీవి మరో సినిమాను ప్రారంభించే విషయంపై దృస్టిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత మరో సంచలన చిత్రంలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల మహానటి టీమ్ను అభినందించిన సమయంలో త్వరలోనే అధికారికంగా తన సినిమాపై ప్రకటన చేస్తానని చిరంజీవి అన్నారు.
కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్
సైరా నర్సింహారెడ్డి చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి జత కట్టనున్నట్టు సమాచారం. రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంగా తెరకెక్కే ఈ చిత్రానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల చిరంజీవి, కొరటాల శివ కథా చర్చలు జరిపినట్టు తెలిసింది. కొరటాల శివ చెప్పిన కథకు చిరంజీవి సంతృప్తి చెందినట్టు సమాచారం.
బోయపాటితో రాంచరణ్ బిజీ
వాస్తవానికి కోరటాల శివతో రాంచరణ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో చెర్రీ బిజీగా ఉండటం, ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి సినిమా కూడా చేయాల్సి ఉండటంతో శివతో జత కట్టే విషయాన్ని రాంచరణ్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో సినిమా ఫిక్స్ చేసినట్టు తెలిసింది.
సైరాతో మెగాస్టార్ చిరంజీవి బిజీ బిజీ
కొరటాల శివతో సినిమా నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైరా నర్సింహారెడ్డి బయోపిక్ను పూర్తి చేసేందుకు చిరంజీవి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రత్యేక పాత్రలో అమితాబ్
జాతీయ స్థాయిలో భారీ ప్రాజెక్ట్గా సైరాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. నర్సింహారెడ్డి గురువు పాత్రలో బిగ్బీ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.