జూ ఎన్టీఆర్ ‘శక్తి’ పై అంచనాతోనే ప్రభాస్ తో కమిట్ అయ్యాడా...!
ప్రభాస్ హీరోగా 'బిల్లా" సినిమాని తెరకెక్కించిన మెహర్ రమేష్, మరోమారు ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడట. త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుష్క, కాజల్ నటించబోతున్నట్టు సమాచారం. 'శక్తి" తర్వాత మెహర్ రమేష్ చేయబోయే చిత్రం ఇదే అవుతుందనీ, క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరిగా ఈ సినిమా తెరకెక్కనుందనీ టాలీవుడ్ సర్కిల్స్ లో గాసిప్స్ విన్సిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, మెహర్ రమేష్, అల్లు అర్జున్ కోసం ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి ప్లాన్ చేస్తున్నాడనీ, ఈ మేరకు బన్నీ ఆమోదం కూడా లభించిందనీ తెలుస్తోంది. 'శక్తి" సినిమా గురించి ఇన్ సైడ్ సోర్సెస్ నుంచి వస్తోన్న వార్తల నేపథ్యంలో మెహర్ రమేష్ కి డిమాండ్ బాగా పెరిగిపోయిందిప్పుడు టాలీవుడ్ లో. ఈ డిమాండ్, 'శక్తి" సినిమా విడుదలయ్యాక కూడా వుంటుందా? అంచనాలను మించే విజయం 'శక్తి" సాధిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











