Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విలన్ పాత్రలు చేయడాని సిద్ధమైన సుమంత్
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఎఎన్ఆర్ మనవడు సుమంత్ ఒకరు. ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాల్లో నటించినప్పటికీ ఒక్కటంటే ఒక్క భారీ హిట్ కూడా సుమంత్కు దక్కలేదు. దీంతో విలన్ పాత్రల వైపు దృష్టి సారిస్తున్నాడు. ఈ విషయాన్ని సుమంత్ స్వయంగా వెల్లడించారు.
'ఈ సంవత్సరం పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించాలన్నది నా చిరకాల కోరిక. అలాంటి పాత్ర ఎవరైనా ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. అలాంటి పాత్రలు తెమ్మని మా మేనేజర్కు కూడా చెప్పాను' అంటూ సుమంత్ వెల్లడించారు. సుమంత్ వాలకం చూస్తుంటే విలన్గా క్లిక్ అయితే అవకాశాలు పెరుగుతాయనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి హీరో రాణా కూడా విలన్ పాత్రలు చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'బహుబలి' చిత్రంలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.
ప్రస్తుతం సుమంత్ చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం చేస్తున్నారు. రచయిత, దర్శకుడు మదన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''సగం భారతదేశంలో, సగం అమెరికాలోనూ సాగే కథ ఇది. సుమంత్ పాత్ర యూత్ ను తప్పకుండా ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం సంగీత చర్చలు జరుగుతున్నాయి. చైతన్యప్రసాద్ సాహిత్యం అందిస్తున్నారు. దర్శకునిగా నాకెంతో పేరు తీసుకొచ్చిన 'ఆ నలుగురు'కు మదన్ కథ అందించారు. అటువంటిది ఇప్పుడు అతని సంస్థలో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.'' అన్నారు. 'మధుమాసం' తర్వాత సుమంత్,చంద్ర సిద్దార్ద చేస్తున్న చిత్రం ఇదే.