Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అజ్ఞాతవాసి బ్లాక్ టికెట్ల దందా.. 3 వేల నుంచి 10వేలు లూటీ.. జిల్లాల్లో అభిమానులు కుమ్ములాట..
Recommended Video
పవర్స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అభిమానులు టికెట్ల కోసం అన్ని రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో ప్రీమియర్ షోలకు అనుమతి లభించగా, తెలంగాణలో భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు. అయితే ఏపీలో అజ్ఞాతవాసి టికెట్ల కుమ్ములాటకు సంబంధించిన వార్త మీడియాలో హల్చల్ చేస్తున్నది.
అభిమానుల కుమ్ములాట
అజ్ఞాతవాసి విడుదల సందర్బంగా నెల్లూరు జిల్లాలో టికెట్లు కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు రెండు వర్గాలుగా చీలారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో కొందరు టికెట్ల దందా చేస్తున్నారు. నిజమైన అభిమానులకు టికెట్లు దొరకడం లేదని జిల్లా ఎస్పీకి ఓ వర్గం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
టికెట్ల కోసం హోరాహోరీగా
జనవరి 10 (బుధవారం) విడుదల కానున్న అజ్ఞాతవాసి చిత్రం టికెట్లు కోసం అభిమానులు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల పవన్కళ్యాణ్ అభిమానులు ధియేటర్ యాజమాన్యాన్ని కలిసి చర్చలు జరిపాయి. అయితే వర్గాలుగా చీలిపోవడంపై యాజమాన్యం ఏ సంఘానికి మద్దతివ్వడమనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నది.
టికెట్ల పంపిణి ఇలా
చిరంజీవి యువత, పవన్కళ్యాణ్ జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షుడు టోనీ వర్గాలకు థియేటర్ యాజమాన్యం కొన్ని సంవత్సరాలుగా టికెట్లు పంపిణీ చేసేవి. చిరంజీవి యువతకు 60శాతం, టోనికి 40శాతం టికెట్లు ఇచ్చేవారు.
రంగంలోకి జనసేన
అయితే తాజాగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న ఓ వర్గం కొత్త కుంపటి పెట్టింది. ఈ వర్గం కూడా అజ్ఞాతవాసి టికెట్ల కోసం రంగంలో దిగడంతో థియేటర్ యాజమాన్యం వాటిని సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. ఇది కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు. అన్ని జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
అన్ని చోట్ల బ్లాక్ టికెట్ల దందా
పవన్, మెగా అభిమానులు వర్గాలుగా విడిపోవడం, వారి మధ్య టికెట్ల కుమ్ములాట మొదలైన నేపథ్యంలో బ్లాక్ టికెట్లు అమ్మే మూట మధ్యలో దూరి భారీ ధరకు టికెట్లు అమ్మకాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
3 నుంచి 10 వేల వరకు
ఫ్యాన్స్ షో పేరుతో సుమారు రూ.100 టికెట్టును రూ.3000 నుంచి రూ.10 వేల వరకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. టికెట్లకు ఇరు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉన్న కారణంగా అభిమానుల బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి బ్లాక్ టికెట్ల మాఫియా రంగంలో దిగింది.
పోలీసుల రంగంలోకి
అన్ని జిల్లాలోనూ బ్లాక్ టికెట్ల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తెల్లవారుజామున షో ఉండడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
తెలంగాణలో విజృంభణ
తెలంగాణ ప్రత్యేక ఆటలు, ప్రీమియర్లకు అనుమతి లేకపోవడం వల్ల టికెట్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్తోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలలో భారీగా బ్లాక్ టికెట్ల వ్యవహారం విజృంభించే అవకాశం ఉంది.