twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోశయ్య చేతుల మీదగా అల్లరి నరేష్ అహనాపెళ్లంట పాటలు విడుదల

    By Nageswara Rao
    |

    అల్లరి నరేష్ కథానాయకుడిగా వీరభద్రచౌదరి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన 'అహనాపెళ్లంట" చిత్రం పాటలను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని రోశయ్య ఆవిష్కరించి, తొలి ప్రతిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గరికపాటి కిషోర్‌కి అందించారు.

    అనంతరం ఈ కార్యక్రమానికి రోశయ్య పై విధంగా స్పందించారు. దర్శకుడు మాట్లాడుతూ- "అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా ఇది. రఘు కుంచె సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. నరేష్ సినిమాలో పెద్ద హిట్‌గా ఈ సినిమా నిలుస్తుంది. నాకీ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్స్" అని చెప్పారు. 'బంపర్ ఆఫర్" తర్వాత చేస్తున్న సినిమా ఇదని, మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని, నరేష్ కెరీర్‌లోనే ఇది పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందని సంగీత దర్శకుడు కుంచె రఘు అన్నారు. షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత గరికపాటి కిషోర్ తెలిపారు.

    రీతూ బర్మేచ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి, డా.బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, జయప్రకాష్ ‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నాగినీడు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సేపన, కెమెరా: లోక్‌నాథ్, నిర్మాణం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X