Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రెగ్నింట్..ఎవరు,నేనా స్టార్ హీరోయిన్ మండిపాటు
తను ప్రెగ్నింట్ నంటూ కావాలనే కొంతమంది దుష్పచారం చేస్తున్నారంటూ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ మండిపడుతోంది. అయితే ఇదంతా మేం చేసిన ఓ యాడ్ పిలిం వలన వచ్చింది. అందులో అబిషేక్ నా వంక చూస్తూ..ఓ సంతోషకరమైన వార్త..నువ్వు చెప్తావా..నే చెప్పనా అంటూ అడుగుతాడు. అది చూసిన వారంతా నేను ప్రెగ్నింట్ ననే వార్త చెప్తాడని ఊహిస్తారు. వినటానికి అప్పుడు ఆ యాడ్ బాగానే అనిపించింది. కానీ ఇప్పుడది నెగిటివ్ రూమర్స్ కు దారితీస్తోంది అంటోది ఐశ్వర్యారాయ్. అయితే ఆమె అభయ్ డయోల్ చిత్రం క్రూకెడ్ ఒప్పుకోకపోవటంతో అందరికీ ఈ డౌట్ వచ్చిందంటున్నారు. అయితే మణిరత్నం తో చేస్తున్న రావణ్, సంజయ్ లీలా భన్సాలీ గుజారిష్, శంకర్ రోబో చిత్రాలు పూర్తి కాకుండా ఎలా నిర్ణయం తీసుకుంటాననుకుంటున్నారు అంటోంది. ఇక ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు బలపరుస్తూ..ఐశ్వర్యకు తన గురించి తాను ఆలోచించటానికి టైమ్ లేదు. రకరకాల ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే బ్రేక్ తీసుకోవటమే మేలని పిస్తోంది అని వ్యాఖ్యానించింది.అయితే తాజాగా ఆమె బెన్ కింగ్లస్ లే సరసన ముంతాజ్ గా చేస్తున్న తాజ్ మహల్ ప్రాజెక్టును కూడా డ్రాప్ చేసుకునేటట్లు ఉందని తెలుస్తోంది.దీని అర్ధమేమిటని మరికొంతమంది అంటున్నారు.