Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఐశ్వర్య తన భర్తతో కలిసి సీక్రెట్గా...
బాలీవుడ్ స్టార్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బుధవారం రాత్రి సీక్రెట్ గా ఓ పార్టీకి హాజరయింది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఐశ్వర్య కోసం ఆమె సన్నిహితులైన డిజైనర్స్ అబూజానీ, సందీప్ కోస్లాలు బాంద్రాలోని సీమంతం(బేబీ షవర్ పార్టీ) పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. త్వరలో ఐష్ పండంటి కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో బచ్చన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలకాలం గుర్తుండి పోయే వేడుక చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారట. సాంప్రదాయ బద్దంగా పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు, నార్త్ ఇండియా...సౌతిండియా వంటకాలతో వంటలు అదర గొట్టారు.
కాగా...ఐశ్వర్య రాయ్ గర్భవతి అయిన నేపథ్యంలో బెట్టింగ్ ఇప్పటికీ జోరుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు కవల పిల్లలు, ఆడ బిడ్డ, మగ బిడ్డ అనే అంశాలతో పాటు, ఐశ్వర్య ఎప్పుడు ప్రసవిస్తుంది అనే దానిపై కూడా పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు కాస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పందెం రాయుళ్లు....ఐష్ బిడ్డకు జన్మనిచ్చే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.