Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్నికల బరిలో ఐశ్వర్యారాయ్!!
అలాగే బాలివుడ్ మెగాస్టార్ సంజయ్దత్ నూ కూడా లోక్సభ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. ప్రస్తుతం వాజ్పేయి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో లోక్సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడని సమాజ్వాదీపార్టీ (ఎస్పీ) ప్రధాన కార్యదర్శి అమర్సింగ్ ప్రకటించారు. గురువారం ఇక్కడ జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆయన మీడియాతో చెప్పారు. అయితే సంజయ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సుప్రీంకోర్టు అనుమతించాల్సి ఉంది. గతంలో టాడా ప్రత్యేక కోర్టు దత్ను దోషిగా నిర్థరించి శిక్ష విధించింది. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ఈపిటిషన్ విచారణలో ఉంది. అందువల్ల ఇప్పుడు దత్ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది న్యాయస్థానం చేతిలో ఉంది.
ఇక ఐశ్వర్య రాయ్,అభిషేక్ బచ్చన్, విక్రమ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'రావణ్'. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల కేరళలోని అడవుల్లో జరిగింది. తాజాగా మధ్యప్రదేశ్లోని మారుమూల పల్లెల్లో చిత్రీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి ద్వితీయార్థంలో ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఫిబ్రవరిలో తమిళనాడులోని కుంభకోణంలో మరో షెడ్యూల్ ఉంటుందని సమాచారం.