twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల బరిలో ఐశ్వర్యారాయ్!!

    By Staff
    |

    Aishwarya Rai
    బాలీవుడ్‌ నటీనటులను ఎన్నికల బరిలోకి దింపడానికి సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ) మొదటినుంచి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అలగే తాజాగా బాలీవుడ్‌ అందాలతార ఐశ్వర్యారాయ్‌ ఎస్పీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎక్కడ నుంచి పోటీ చేయించాలని ఇంకా నిర్ణయం చేయలేదు. ప్రస్తుతం మణిరత్నం రావణ్ షూటింగ్ లో ఉన్న ఆమెకీ విషయం తెలియబరిచి మీడియా ముందు పెట్టారు. ఇప్పటికే ఆమె అత్తగారు అమితాబ్‌ భార్య జయాబచ్చన్‌ ఎస్పీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    అలాగే బాలివుడ్ మెగాస్టార్‌ సంజయ్‌దత్‌ నూ కూడా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. ప్రస్తుతం వాజ్‌పేయి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడని సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ) ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ ప్రకటించారు. గురువారం ఇక్కడ జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆయన మీడియాతో చెప్పారు. అయితే సంజయ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సుప్రీంకోర్టు అనుమతించాల్సి ఉంది. గతంలో టాడా ప్రత్యేక కోర్టు దత్‌ను దోషిగా నిర్థరించి శిక్ష విధించింది. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ఈపిటిషన్‌ విచారణలో ఉంది. అందువల్ల ఇప్పుడు దత్‌ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది న్యాయస్థానం చేతిలో ఉంది.

    ఇక ఐశ్వర్య రాయ్‌,అభిషేక్‌ బచ్చన్‌, విక్రమ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'రావణ్‌'. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల కేరళలోని అడవుల్లో జరిగింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మారుమూల పల్లెల్లో చిత్రీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి ద్వితీయార్థంలో ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఫిబ్రవరిలో తమిళనాడులోని కుంభకోణంలో మరో షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X