Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఇండియాలో అత్యంత ఖరీదైన మూవీ టికెట్స్: లిస్టులో ‘బాహుబలి 2’ టాప్!
ఢిల్లీలోని పివిఆర్ థియేటర్ ఖరీదైన థియేటర్గా రికార్డులెక్కింది. ఈ థియేటర్లో సినిమా చూడాలంటే వేలల్లో చెల్లించాల్సిందే.
బాక్సాఫీసు వద్ద మూవీ కలెక్షన్ల విషయంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏ హీరో సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అంత గొప్ప. అభిమానులు కూడా ఈ విషయాన్ని చాలా ప్రెస్టీజియస్గా చెప్పుకుంటూ ఉంటారు.
ఇండియాలో ప్రతి ఏడాది వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ సినిమాల్లో బాలీవుడ్ ఖాన్ త్రయం నటించిన సినిమాలే కలెక్షన్ల విషయంలో టాప్ పొజిషన్లో ఉంటూ ఉంటాయి. ఈ కలెక్షన్ల వివరాలు పక్కన పెడితే.... తాజాగా ఇండియాలో అత్యంత కాస్లియెస్ట్ టికెట్స్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.
ఇండియాలో ఖరీదైన థియేటర్
ఇండియాలో అత్యంత ఖరీదైన సినిమా థియేటర్ ఏదైనా ఉంది అంటే... అది ఢిల్లీలోని ‘పివిఆర్ డైరెక్టర్స్ కట్' అనే థియేటర్. ఇందులో సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిందే. సినిమాకు ఉన్న డిమాండును బట్టి ఈ థియేటర్లో టికెట్స్ రేటు మారుతూ ఉంటుంది.
Recommended Video
బాహుబలి మూవీ టాప్
ఇప్పటి వరకు ఈ థియేటర్లో అత్యంత ఎక్కువ ధరకు టికెట్స్ అమ్మకానికి పెట్టిన సినిమాల్లో ‘బాహుబలి 2' మూవీ టాప్ పొజిషన్లో ఉంది. బాహుబలి 2 విడుదలైన సమయంలో డిమాండ్ భారీగా ఉండటంతో ఒక్కో టికెట్ రూ. 2400 ధరకు అమ్మారు. ఇండియాలో అఫీషియల్గా అత్యంత ఎక్కువ టికెట్ రేటు నమోదైన సినిమా ఇదే.
షారుఖ్ మూవీకి కూడా
త్వరలోనే విడుదల కాబోతున్న షారుక్ ఖాన్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్' మూవీకి డిమాండ్ అదే స్థాయి ఉంది. ఇప్పటికే ఈ థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. ఒక్కో టికెట్ ధర రూ. 2400గా ఉంది.
రెండవ స్థానంలో ఐశ్వర్యరాయ్ మూవీ
ప్రభాస్ ‘బాహుబలి 2', షారుక్ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్' తర్వాత ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్' మూవీ అత్యంత ఎక్కువ ధర పలికిన సినిమాగా సెకండ్ ప్లేసులో ఉంది. ఈ సినిమా టికెట్ ‘పివిఆర్ డైరెక్ట్స్ కట్' థియేటర్లో రూ. 2200లకు అమ్మడయింది.
మూడో స్థానంలో సుల్తాన్
సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టిక్కెట్ రూ. 1800లకు అమ్ముడు పోయింది.
రయీస్
షారుక్ ఖాన్ నటించిన ‘రయీస్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.
ట్యూబ్ లైట్
ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్' టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.