Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
పబ్లిక్ ఫంక్షన్లో కన్నీళ్ళు పెట్టుకున్న ఐశ్వర్యారాయ్: ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం వల్లే
తన తండ్రి స్మారకార్థం తలపెట్టిన ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యను ఫొటోగ్రాఫర్లు అదే పనిగా ఫొటోలు తీస్తుండటంతో ఆమె అసహనానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది.
Recommended Video
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య నవంబర్ 16న తన ఆరో పుట్టిన రోజు జరపుకున్న సంగతి తెలిసిందే. ఆరాధ్య బర్త్డేని బచ్చన్ ఫ్యామిలీ చాలా గ్రాండ్గా నిర్వహించింది. బాలీవుడ్కి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు బర్త్డే వేడుకలో సందడి చేశారు.
మనీష్ మల్హోత్రా
ఇక పార్టీకి ఆరాధ్య.. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన పింక్ గౌన్ని ధరించింది. దీని ఖరీదు దాదాపు 60 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ గౌనుతో పాటు ఆరాధ్య ధరించిన లెదర్ చియారా ఫ్రీ- వాకర్స్ షూస్ ధర రూ. 20 వేలు అని తెలుస్తుంది.
కూతురి బర్త్డే
తన ఫాదర్ మరణించిన తర్వాత ఫంక్షన్స్కి కాస్త దూరంగా ఉన్న ఐష్ తన కూతురి బర్త్డేని మాత్రం తన స్వగృహం ప్రతీక్ష లో అత్యంత గ్రాండ్గా నిర్వహించింది. ఆ తర్వాత ఈ అందాల రాణి ఐశ్వర్య రాయ్ ఒక పబ్లిక్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత దివంగతుడైన తన తండ్రి స్మారకార్థం 100 మంది చిన్నారులకు గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలు చేయించాలని ఐష్ నిర్ణయించుకుంది.
కన్నీళ్లకు కారణం ఫొటోగ్రాఫర్లే
దీనికి సంబంధించి ఓ ఆసుపత్రి సౌజన్యంతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసింది ఐష్. ఈ కార్యక్రమానికి మీడియా వాళ్లు కూడా వచ్చారు. ఆమె కన్నీళ్లకు కారణం ఫొటోగ్రాఫర్లే. తన తండ్రి స్మారకార్థం తలపెట్టిన ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యను ఫొటోగ్రాఫర్లు అదే పనిగా ఫొటోలు తీస్తుండటంతో ఆమె అసహనానికి గురైంది.
కన్నీళ్లు పెట్టుకుంది
ఎంత చెప్పినా ఫొటోగ్రాఫర్లు వినకుండా ఒక ఫ్యాషన్ ఈవెంట్ తరహాలో ఫొటోలు తీస్తూనే ఉండటంతో ఐష్ ఫ్రస్టేట్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది.పెద్ద ఎత్తున ఫొటోగ్రాఫర్లు విచ్చేసి.. ఐష్ ను అదే పనిగా ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఫొటోలు ఆపమని విన్నా వాళ్లు వినలేదు.
అసహనం వ్యక్తం చేసింది
దీంతో ఐశ్వర్యకు ఆగ్రహం - ఆవేదన తన్నుకొచ్చాయి. ఇది ఫ్యాషన్ ఈవెంట్ కాదని.. ఒక మంచి కార్యక్రమం అని.. పని ఎలా చేయాలో మీకు తెలియదా అని అసహనం వ్యక్తం చేసింది ఐష్. ఆ సమయంలో తన తండ్రిని కూడా తలుచుకోవడం వల్లో ఏమో ఆమెకు కన్నీళ్లు వచ్చేశాయి.