Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐశ్వర్యారాయ్, జయ బచ్చన్ సేఫ్.. కానీ రిపోర్ట్స్ వచ్చే వరకు కచ్చితంగా చెప్పలేము..
కరోనా వైరస్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే బయపడాల్సిందే. పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వైరస్ భారిన పడుతున్నారు. ఇక ఇటీవల ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి అలాగే ఆయన తనయుడికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఉన్నత వ్యక్తులను కూడా కరోనా ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఐశ్వర్యారాయ్, జయ బచ్చన్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మరింత ఆందోళన కలిగిస్తోంది.
అనుమానం రాగానే..
లక్షణాలు ఉన్నాయని అనుమానం రాగానే అమితాబ్ బచ్చన్ శనివారం వైద్యులను సంప్రదించారు. అలాగే ఆయన తనయుడు అభిషేక్ కూడా టెస్ట్ చేయించుకున్నారు. అయితే వారికి పాజిటివ్ అని తేలడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం వారు ముంబై నానావతి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే విధంగా అమితాబ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.
అమితాబ్ వివరణ..
పనివాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని అమితాబ్ బచ్చన్ వైద్యులకు వివరణ ఇచ్చారు. అయితే అమితాబ్ బచ్చన్ సతీమణి జయ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రతి ఒక్కరిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వివరణ ఇచ్చారు.
ఆ పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చింది..
కేవలం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కి సంబంధించిన రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. వారితో గత కొన్నిరోజులుగా దగ్గరగా ఉన్న కుటుంబ సబ్యులకు అలాగే డ్రైవర్లకు పనివాళ్లకు కూడా కరోనా టెస్టులు నిర్వహించడం జరిగింది. యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని అయితే ఇంకా పూర్తిస్థాయిలో రిపోర్ట్స్ రావాల్సి ఉందని అప్పటి వరకు వారిని క్వారంటైన్ లోనే ఉంచడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు.
Recommended Video
ఆ రిపోర్ట్స్ నేడు రావచ్చు..
ఐశ్వర్యారాయ్ బచ్చన్, జయ బచ్చన్ అలాగే మిగతా కుటుంబ సభ్యుల పూర్తి స్థాయి రిపోర్ట్స్ నేడు రావచ్చని మంత్రి రాజేష్ ఒక మీడియాకు వివరణ ఇచ్చారు. ఇక అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వీలైనంత త్వరగా కొలుకుంటారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. బచ్చన్ హీరోలు కరోనా వైరస్ భారిన పడటం సినీ లోకాన్ని షాక్ కి గురి చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆయన త్వరగా కొలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.