Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాగార్జునకు తోడుగా ఐశ్వర్య రాయ్!
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం 'కల్యాణ్ జ్యువెల్లర్స్' ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ తరపున నాగార్జున నటించిన యాడ్లు విభిన్నంగా, ఇతర జ్యువెల్లరీ షాపులోల్లంతా మోసగాళ్లు అనే రీతిలో ఉండటం ఆయాడ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం అందాల తార ఐశ్వర్య రాయ్ కుడా 'కల్యాణ్ జువెల్లర్స్ 'కు బ్రాండ్ అంబాసిడర్గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సదరు సంస్థ ఐశ్వర్య రాయ్కి రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఐశ్వర్య మామ అమితాబ్ కూడా ఈ కంపెనీకి కో-బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.
కేరళకు చెందని కల్యాణ్ జువెల్లర్స్ ఇప్పటికే దక్షిణాదిన 32 షోరూంలతో తన వ్యపారాన్ని విస్తరించింది. ఉత్తరాదిన కూడా వ్యాపార విస్తరణలో భాగంగా ఐశ్వర్యరాయ్, అమితాబ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇటీవలే నాలుగు నెలల క్రితం పండంటి పాపాయికి జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రసవం కారణంగా బాగా బరువు పెరిగిన తన శరీరాన్ని మళ్లీ హీరోయిన్ పర్సనాలిటీకి తగిన విధంగా మలుచుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఆమెతో సినిమా చేయడానికి ఇప్పటికే బోలెడు మంది దర్శకులు, నిర్మాతలు క్యూలో ఉన్నారు.