ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందట: బాబ్రీ మీద విజయేంద్రప్రసాద్ సినిమా
వివాదాస్పదమైన బాబ్రీ మసీదు ఇతివృత్తంతో నిర్మించనున్న 'కబీర్' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. 1992 డిసెంబరు 6 వతేదీన జరిగిన బాబ్రీ విధ్వంసం అనంతరం దేశంలో నెలకొన్న పరిణామాలపై ఈ సినిమా నిర్మించనున్నట్లు సినీవర్గాల భోగట్టా.

'బాహుబలి', 'భజరంగీ భాయిజాన్' చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ రాసిన బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం కథకు హీరోగా అజయ్ దేవగన్ను ప్రతిపాదించారు. కబీర్ పేరిట నిర్మించనున్న ఈ సినిమాకు కథా రచయిత విజయేంద్రప్రసాదే దర్శకత్వం వహిస్తారని సమాచారం. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లాని ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రభుత్వానికి అనుకూలంగా లేదని సినీ వర్గాలు చెపుతున్నాయి. త్వరలో సెట్ మీదకు రానున్న కబీర్ చిత్రం వివాదాస్పదంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











