వేరు వేరు రంగాల్లో దిగ్గజాలు.. ఓకే ఫ్రేమ్‌లో ఆ ఇద్దరూ.. వైరల్ పిక్

అన్ని రంగాల్లోనూ దిగ్గజాలు ఉంటారు. తమ తమ టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే గాక, అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంటారు కొందరు. ఆ కోవలోకే వస్తారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, టీం ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆ ఇద్దరూ ఇప్పుడు ఓకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీని కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన 'భారత్‌లో సినిమా, క్రికెట్‌ రెండూ ఒకే మతం' అని ట్యాగ్ చేశారు. దీంతో ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫొటో చూసిన అభిమానులు వేల సంఖ్యలో లైకులు కొడుతూ రీట్వీట్లు చేస్తున్నారు.

Ajay Devgn shares Viral With MS Dhoni

ఇలా ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలను చూడటం సంతోషంగా ఉందని ఎంఎస్ ధోనీ, అజయ్ దేవ్‌గణ్‌ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టుకు ఇప్పటికే 46,000 లైక్‌లు వచ్చాయి. అలాగే 9.4 వేల మంది రీట్వీట్‌లు చేసారు. మరికొందరు వీరిద్దరిపై జోకులతో కూడిన మీమ్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌' ఈ రోజు విదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధోనీని అజయ్‌ దేవగణ్ కలిశారు.

కాగా అజయ్ దేవగణ్‌ చేసిన ఈ పోస్టుపై మరో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి స్పందించారు. 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్. ఫొటోలో ఇద్దరు చించేశారు' అని పేర్కొన్నారు. అజయ్‌ దేవగణ్‌ చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌'. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. కాజోల్‌, శరద్‌ కేల్కర్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X