Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'దృశ్యం' సినిమాకు పన్ను మినహాయింపు ...కృతజ్ఞతలు
ముంబై: అజయ్ దేవగన్, శ్రేయ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం. ఈ సినిమా ఇటీవల బాలీవుడ్లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్లో ఈ సినిమాకు పన్ను మినహాయించారు. తన సినిమాకు పన్ను మినహాయించినందుకు కృతజ్ఞతలంటూ అజయ్ ట్విట్టర్ ద్వారా యూపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడండి.
Thanks
to
UP
Govt.
and
@yadavakhilesh
for
making
@DrishyamTheFilm
tax
free.
One
more
reason
for
you
all
to
watch
the
film.
—
Ajay
Devgn
(@ajaydevgn)
August
11,
2015
దీంతో ప్రజలందరూ తన సినిమా చూసేందుకు అవకాశం దొరికిందన్నారు. ఇటీవల మాసాన్, బజరంగీ భాయిజాన్, హమారీ అధూరీ కహానీ లాంటి చిత్రాలకు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్ను మినహాయించిన విషయం తెలిసిందే
ఇక ఈ చిత్రాన్ని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ రీసెంట్ గా చూసారు. ఆయన ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూడాల్సిన చిత్రంగా చెప్పారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'నేను దృశ్యం చూశాను... తప్పక చూడాల్సిన చిత్రం అని' తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే హిందీ 'దృశ్యం' ఘన విజయం సాధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు.
ఆ క్రమంలో హీరో అజయ్ దేవగన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో అమిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దృశ్యం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం విదితమే.
నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దృశ్యం చిత్రం హిందీలో రీమేక్ అయింది. దృశ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన శ్రియ శరన్ నటించగా... టబూ పోలీసు అధికారిగా నటించారు.
'దృశ్యం' సినిమాకు వస్తున్న స్పందన పట్ల హీరో అజయ్ దేవగణ్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది అరుదైన చిత్రమని పేర్కొన్నాడు. 'దృశ్యం సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతృప్తిగా ఉన్నా. మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ అరుదైన సినిమాను నటుడిగా గౌరవిస్తా' అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు.
అన్ని భాషల్లోనూ విజయవంతం అయిన 'దృశ్యం' హిందీలోనూ విజయవంతంగా నడుస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రూ. 30.33 కోట్లు వారాంతపు వసూళ్లు సాధించింది. శ్రియా శరణ్, టబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ సాలగోంకర్ దర్శకత్వం వహించారు. వియకొమ్ 18, కుమార్ మాగ్నత్ నిర్మించారు.