Don't Miss!
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
షూటింగులో ప్రమాదం... హీరో అజిత్కి తీవ్రగాయాలు
యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.... యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అజిత్ ఒక కారు నుంచి మరో కారులోకి దూకే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో ఆయన కుడి కాలుకు తీవ్రమైన గాయం అయింది. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి షూటింగ్ నిలిపి వేసారు.
దాదాపు రెండు నెలలుగా ఈచిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగులో నయనతార, తాప్సి, ఆర్య, సుమన్ రంగనాథ్, అతుల్ కులకర్ణి, మహేష్ మంజ్రేకర్ తదితరులు పాలు పంచుకుంటున్నారు. అజిత్ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగులో పాల్గొననున్నాడు.
అజిత్ తర్వలో 'దరువు' దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నట్లు తెలుస్తోంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు.