Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అజిత్ ‘ఆరంభం’ కథ, టాక్ ఏంటి?
హైదరాబాద్ :అజిత్, నయనతార జంటగా విష్ణువర్దన్ (పంజా డైరక్టర్) దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరంభం'. ఈ చిత్రం తమిళనాట అక్టోబరు 31న విడుదలైంది. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అవినీతి, మోసం, ప్రతీకారం ప్రధానాంశాలతో రూపొందిన ఈ చిత్రం కథ బుల్లెట్ ఫ్రూప్ జాకెట్స్ స్కామ్ ఆధారంగా రూపొందింది. రెగ్యులర్ రొటీన్ ..రివేంజ్ కాన్సెప్ట్ అయినా చెప్పిన నేరేషన్ ప్రేక్షకులను కట్టిపారేస్తోంది. అజిత్ కెరీర్ లో మరో పెద్ద ఘన విజయం సాధించిన చిత్రంగా దీన్ని చెప్తున్నారు.
కథలో అశోక్(అజిత్),మాయ(నయనతార),అర్జున్(ఆర్య)కలిసి ఓ మిషన్ పై పనిచేస్తూంటారు. అర్జున్ ఓ కంప్యూటర్ హ్యాకర్. హై సెక్యులర్ సిస్టమ్స్ వారు హాక్ చేస్తూంటారు. ఆర్య గర్ల్ ప్రెండ్ అనిత(తాప్సి) ఓ జర్నలిస్ట్. ఆమె కూడా ఈ డ్రామా లో ఉపయోగపడుతుంది. అశోక్ ఓ లా బ్రేకర్ గా కనిపిస్తాడు. అయితే అసలు అశోక్ అలా ఎందుకు మారి...ఇతర సిస్టమ్స్ ని హ్యాక్ చేయాల్సి వచ్చింది అనేది సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్(రానా) పూర్ క్వాలిటీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ వాడటం వల్ల మరణిస్తాడు. సంజయ్ ...అశోక్ కి క్లోజ్ ప్రెండ్. తన స్నేహితుడు మరణానికి కారణమైన క్రిమినల్స్ పని పట్టడానికి ఇలా అశోక్..లా బ్రేకర్ గా మారి... యుద్దం చేస్తున్నాడన్నమాట. ఇంతకీ ...అతను ఈ విషయంలో సక్సెస్ అయ్యాడా... కథలో మెయిన్ ట్విస్ట్ ఏమిటి అనేది మిగతా కథ.
శ్రీ సత్యసాయి మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు అనువాద హక్కులను చండీ నిర్మాత డా.శ్రీనుబాబు.జి సొంతం చేసుకున్నారు. ఒమిక్స్ క్రియేషన్స్ పతాకంపై ప్రియమణి ప్రధాన పాత్రలో చండీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆయన. . ప్రియమణి ప్రధాన పాత్రలో గా ఆయన నిర్మించిన 'చండీ' చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది.
ఈ సందర్భంగా డా.శ్రీనుబాబు మాట్లాడుతూ ' అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అనువాద హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కుల్ని మేం పొందాం. అజిత్కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తాం. త్వరలోనే అనువాద కార్యక్రమాలు ప్రారంభిస్తాం' అని తెలిపారు.ఈ చిత్రానికి సంగీతం: యువన్శంకర్రాజా, ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్, నిర్మాత: డా.శ్రీనుబాబు జి., దర్శకత్వం: విష్ణువర్థన్.