Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పోరీతో పూరి కొడుకు రచ్చకి డేట్ ఫిక్సైంది
హైదరాబాద్ :మరాఠీలో విజయం సాధించిన చిత్రం 'టైమ్ పాస్'. తెలుగులో 'ఆంధ్రా పోరి' అనే పేరుతో పునర్ నిర్మిస్తున్నారు. ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటించారు.రాజ్మదిరాజు దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేస్తారు. మే 15 న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ''మా సంస్థలో తెరకెక్కిన 30వ చిత్రమిది. రాజ్మదిరాజును 'రుషి'తో మేమే పరిచయం చేశాం. ఈ సినిమానూ చాలా బాగా తీశాడు. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాము''అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''32 రోజుల పాటు జరిగిన ఒకే షెడ్యూల్తో సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా నాకో బాధ్యత. నాకు తొలి అవకాశం ఇచ్చిన సంస్థలో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్ ఎంతో నమ్మకంతో ఆకాష్ను మాకు అప్పగించారు. ఆకాష్ బాగా నటించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. జై అందించిన బాణీలు తప్పకుండా అందరినీ ఆకట్టుకొంటాయి''అన్నారు.
డా.శ్రీకాంత్, పూర్ణిమ, ఈశ్వర్రావ్, అరవింద్కృష్ణ,ఊర్మిళ కనిత్కర్, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ప్రవీణ్ వనమాలి, సంగీతం:డా.జె, ఆర్ట్:రాజీవ్ నాయర్, డ్యాన్స్:చంద్రకిరణ్, సాహిత్యం:సుద్దాల అశోక్తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల.