twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యూ... కట్టిన సినీ స్టార్స్

    By Bojja Kumar
    |

    తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సినీ స్టార్స్ మంగళవారం క్యూ కట్టారు. హీరో ఆకాష్ తో పాటు, నిర్మాత సురేష్ బాబు, గాయని సునిత శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక్కసారిగా ఇంత మంది తిరుమల రావడంతో ఆలయం బయట మీడియా హడావుడి ఎక్కువయింది. భక్తులు కూడా స్టార్స్ ను చూసేందుకు పోటీ పడ్డారు.

    ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు రకరకాల ప్రశ్నలు నిర్మాత సురేష్ బాబుపైకి వదిలారు. వాటికి ఆయన ఓపికగా సమాధానంగా ఇచ్చారు. మంచి కథ దొరికితే వెంకటేష్, రాణాతో సినిమాకు రెడీ అని చెప్పారు. గాయని సునీత మాట్లాడుతూ ప్రస్తుతం కెరీర్ సాఫీగానే సాగుతోందని, ఇప్పుడు నాగార్జున నటిస్తున్న షిరిడీసాయిబాబా సినిమాలో పాడుతున్నానని, ఈ చిత్రానికి పని చేయడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు.

    హీరో ఆకాష్ మాట్లాడుతూ... 7 క్యారెక్టర్లు ఉన్న మిస్టర్‌ రాజేష్‌లో యాక్ట్ చేస్తున్నానని ఆ మూవీలోని ఓ పాత్ర కోసమే గుండు చేయించుకున్నానని ఆకాష్‌ చెప్పారు. రహమత్ ప్రొడక్షన్స్ పతాకంపై ఖాదర్ వల్లి నిరిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు దర్శకత్వ బాధ్యతల్ని కూడా హీరో ఆకాష్ నిర్వహిస్తున్నారు.

    ఆకాష్ ఏకంగా ఏడు పాత్రలు పోషించటం విశేషం. లవర్ బాయ్, వెయిటర్, సబ్ ఇన్ స్పెక్టర్, లారీ డ్రైవర్, సాప్ట్ వేర్ ఇంజనీర్, సైకో, బిజినెస్ మేన్ పాత్రలను పోషిస్తున్నాడు. ఆకాష్ సరసన సోని చరిష్ట హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంకా సిమ్రాన్, ధనరాజ్, శివారెడ్డి, గుండు శివ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Tollywood Star Aakash, Suresh Babu and Suneetha visited famous hill temple of Lord Venkateswara today. Media posed several questions to producer Suresh babu. He answered to those questions patiently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X