ఆకాశమంత దర్శకుడితో నాగార్జున
నూతన దర్శకులను ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. ఔత్సాహిక దర్శకులకు ఆయనొక వరం. ఈనారి తెలుగులో ఓ తమిళ దర్శకుడికి అవకాశమిస్తున్నారు. ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన తమిళ చిత్రం 'అభియం నానమ్" తెలుగులో 'ఆకాశమంత" చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మించగా తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. దీనికి దర్శకత్వం వహించిన రాధామోహన్ నాగార్జున చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడని తెలిసింది.
తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. స్ర్కిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో రాధామోహన్ ఉన్నాడు. నాగార్జున ప్రస్తుతం కామాక్షీ మూవీస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే రాధామోహన్ డైరెక్ట్ చేసే చిత్రం తెరపైకి రానుంది.
radhamohan akkineni nagarjuna akashamantha prakash raj trisha abhiyam nanam dil raju రాధామోహన్ నాగార్జున ప్రకాష్ రాజ్ త్రిష అభియం నానమ్ ఆకాశమంత దిల్ రాజు


Click it and Unblock the Notifications