Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జాక్పాట్ కొట్టేసిన ప్లాప్ డైరెక్టర్.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన అల్లు అరవింద్!
Recommended Video
అక్కినేని యువ వారసుడు అఖిల్ అభిమానుల్లో భారీ అంచనాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ తొలి చిత్రం నుంచి అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ అఖిల్ కు విజయాన్ని అందించలేకపోయాయి. దీనితో అఖిల్ తొలి విజయం కోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పడం లేదు. వెంకీ అట్లూరి దర్శత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం మిస్టర్ మజ్నుపై మంచి అంచనాలతో విడుదలయింది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం అఖిల్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి.
ప్లాప్ డైరెక్టర్తో
అఖిల్ తదుపరి చిత్రం గీత గోవిందం దర్శకుడు పరుశురాంతో కానీ, బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తో కానీ ఉండబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో అఖిల్ నటించనుండడం దాదాపుగా ఖరారయింది. అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ చిత్రం క్రేజీ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో తెరకెక్కబోతోంది.
అద్భుత అవకాశం
బొమ్మరిల్లు చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన భాస్కర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. భాస్కర్ తెరకెక్కించిన చివరి చిత్రం ఒంగోలు గిత్త. 2013లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో భాస్కర్ సినిమాల నుంచి కనుమరుగైపొయ్యాడు. ఎట్టకేలకు అతడికి ఓ అవకాశం వచ్చింది. అఖిల్ హీరో, గీత ఆర్ట్స్ నిర్మాణం.. తనని తాను నిరూపించుకునేందుకు భాస్కర్ కు ఇంతకంటే అద్భుత అవకాశం రాదనే చెప్పాలి. అఖిల్ కూడా ఫస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
రంగంలోకి అల్లు అరవింద్
అఖిల్ కు విజయాన్ని అందించేందుకు అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తాడట. బన్నీ వాసు నిర్మాత. గోపి సుందర్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి ప్రేమ కథలు తెరకెక్కించిన భాస్కర్ అఖిల్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడనే ఆసక్తి నెలకొంది.
వేసవిలో ప్రారంభం
మార్చిలో ఈ చిత్రాన్ని లాంచ్ చేసి ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభిస్తారట. నవంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ తర్వాత అఖిల్ దర్శకుల జాబితాలో పరుశురాం, హీరో ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. పరశురాం, సత్యప్రభాస్ ఇద్దరూ అఖిల్ కోసం కథ రెడీ చేసి సిద్ధంగా ఉన్నారట. కానీ అఖిల్ ముందుగా బొమ్మరిల్లు బాక్సర్ దర్శత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.