ఈసారి అఖిల్ ట్రెండ్ సెట్ చేయడం ఖాయం: నాగార్జున
అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన సినిమా ప్రారంభోత్సం ఆదివారం సాయంత్రం 6.17 గంటలకు ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్: అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన సినిమా ప్రారంభోత్సం ఆదివారం సాయంత్రం 6.17 గంటలకు ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నిర్మాత అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ చైతన్య, సుప్రియ, ఎ. నాగ సుశీల, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి విచ్చేసారు.

ప్రొడక్షన్ నెం : 29
అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై నాగార్జున నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం : 29 ' మూవీ ఇది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ టైటిల్ వెల్లడి కానుంది.

అక్కినేని ముని మనవరాళ్ళు
వుడి పటాల మీద తొలి షాట్ చిత్రీకరించారు. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని ముని మనవరాళ్ళు సత్య సాగరి క్లాప్ ని ఇవ్వగా , దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు బి ఏ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దే

నాగార్జున మాట్లాడుతూ
చిత్ర నిర్మాత 'కింగ్' నాగార్జున మాట్లాడుతూ, " 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుంది." ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అయన అన్నారు.

విక్రమ్ కుమార్
ఈ సందర్భంగా, దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ " అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 'మనం' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్ కి ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం అవుతుంది " అన్నారు

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్.


Click it and Unblock the Notifications











