Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'దేవరాయ' కి మరో కులసంఘం సైతం హెచ్చరిక
హైదరాబాద్ : శ్రీకాంత్ హీరోగా తీస్తున్న 'దేవరాయ' అనే సినిమాను విడుదల చేయవద్దని కాపునాడు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లోగా అఖిల భారత యాదవ మహాసభ సైతం... శ్రీకృష్ణదేవరాయలను అవహేళన చేస్తూ సినిమా చేస్తున్నారని, శ్రీ కృష్ణదేవ రాయలు యాదవ వంశానికే చెందిన వారేనని..వారి సంఘం తరుపున హెచ్చరిక జారీ చేసారు. ఆ సినిమాలో కించపరిచే విధంగా సన్నివేశాలు ఉంటే యాదవ సంఘం తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
శ్రీ కృష్ణదేవ రాయలు యాదవ వంశానికే చెందిన వారేనని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మీ అన్నారు. ఆయన్ని కించపరిచే విధంగా, లేక ఆయన వేరు కులానికి చెందిన వారనడం సరికాదన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఆధారాల కోసం ఆయన వంశావళిని తెలుసుకోవాలని సూచించారు. ఆయన వేరే కులస్థుడని ఎవరి దగ్గరైన ఆధారాలున్నాయని నిరూపిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
శ్రీకృష్ణ దేవరాయలును కించపరిచేలా చిత్రీకరించిన 'దేవరాయ' చిత్రంలోని అసభ్యకర దృశ్యాలను వెంటనే తొలగించకపోతే ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకోవటమేగాక సెట్లను తగులబెడతామని రాష్ట్ర కాపునాడు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. శ్రీకృష్ణదేవరాయల పాలనను అవహేళన చేస్తే ఊరుకోమని కాపునాడు అధ్యక్షులు నారాయణస్వామి రాయల్ పేర్కొన్నారు. శ్రీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'దేవరాయ'. విధిశ హీరోయిన్స్ . నానికృష్ణ దర్శకుడు. నానిగాడి సినిమా సమర్పణలో సన్రే ఇంటర్నేషనల్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. కిరణ్ జక్కంశెట్టి, నానికృష్ణ నిర్మాతలు.
దర్శకుడు మాట్లాడుతూ ''గతం తెలుసుకొన్న మనిషి కథ ఇది. అమలాపురంలో దొరబాబు పేరు చెబితే చాలు... పేకాట రాయుళ్లు పండగ చేసుకొంటారు. ఎందుకంటే మనోడికి ఎప్పుడూ ముక్క తిరిగిందే లేదు. అందుకే దొరబాబుతో ఆడాలి, వాడి జేబులోని డబ్బులన్నీ మన చేతికి అందేయాలి.. అని కాపు కాస్తారు. అదొక్కటే కాదు.. దొరబాబుకు చాలా సరదాలే ఉన్నాయి. ఆ అలవాట్లతో ఇల్లూ వాకిలీ గుల్ల చేసుకొన్నాడు. ఆ తరవాత ఏమైంది? అసలు దొరబాబుకీ రాయలవారి వంశానికీ సంబంధం ఏమిటి? జల్సారాయుడిగా పేరుతెచ్చుకొన్న దొరబాబు గతమేంటి? అనేదే కథలో కీలకం. ఈ విషయాలు తెలియాలంటే 'దేవరాయ' సినిమా చూడాల్సిందే.