Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మిస్టర్ మజ్ను ప్రీరిలీజ్ బిజినెస్.. సింపుల్గా అఖిల్ టార్గెట్, హిట్ టాక్ వస్తే చాలు!
అక్కినేని వారసుడు అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను విడుదలకు సర్వం సిద్ధం అయింది. రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందుగా జనవరి 25న మిస్టర్ మజ్ను థియేటర్స్ లోకి వస్తున్నాడు. అఖిల్ కు ఇది మూడవ చిత్రం. తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో అఖిల్ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శత్వం వహించిన ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొంది ఉంది. ఈ రొమాంటిక్ ప్రేమ కథలో అఖిల్ లవర్ బాయ్ గా అదరగొడుతున్నాడు. టీజర్, ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మిస్టర్ మజ్ను చిత్రం రేపే విడుదల కానున్న నేపథ్యంలో ఈ చితా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిద్దాం..
అఖిల్, హలో భారీ స్థాయిలో
అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు అఖిల్, హలో కు భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ చిత్రాలకు బడ్జెట్ కూడా ఎక్కువే అయింది. అఖిల్ చిత్రాన్ని ఏకంగా 40 కోట్ల బడ్జెట్ లో రూపొందించారు. ఈ చిత్రానికి 43 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అఖిల్ చిత్రం డిజాస్టర్ కావడం అందులో సగం వసూళ్లు కూడా సాధించలేక భారీ నష్టాలని మిగిల్చింది. దీనితో రెండవ చిత్రం కోసం నాగార్జునే స్వయంగా రంగంలోకి దిగారు.
మళ్ళీ అదే సీన్
హలో చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మించినా అదే పొరపాటు రిపీట్ అయింది. బడ్జెట్ ఎంత నియంత్రించినా 30 కోట్ల వరకు అఖిల్ చిత్రానికి ఖర్చయింది. ఈ చిత్ర హక్కులని 32 కోట్లకు అమ్మారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచినప్పటికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. దీనితో అఖిల్ మూడవ చిత్రం మిస్టర్ మజ్ను కోసం అన్ని జాగ్రత్తలు పాటించి బడ్జెట్ ని కంట్రోల్ చేయగలిగారు.
అఖిల్ టార్గెట్ ఎంతంటే
అనుభవం ఉన్న నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శత్వంలో తెరకెక్కిన ప్రేమ కథ చితం కావడమతొ మిస్టర్ మజ్ను చిత్రం 20 కోట్ల బడ్జెట్ లోనే పూర్తయింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ హక్కులు 23 కోట్లకు అమ్మారు. శాటిలైట్ హక్కుల రూపంలో మిస్టర్ మజ్ను మంచి ధరే పలికింది. తొలి రెండు చిత్రాల్లో కాకుండా అఖిల్ కు సింపుల్ టార్గెట్ సెట్ అయినట్లు అయింది. మిస్టర్ మజ్ను చిత్రానికి హిట్ టాక్ వస్తే చాలు బ్రేక్ ఈవెన్ సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
పాజిటివ్ బజ్
తొలిసారి అఖిల్ చిత్రానికి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. అఖిల్ సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వెంకీ అట్లూరి ఆల్రెడీ తొలి ప్రేమ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకుని ఉండడంతో మిస్టర్ మజ్నుపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న మిస్టర్ మజ్ను ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.