Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరో టాలెంటెడ్ దర్శకుడి దృష్టిలో పడిన అక్కినేని అఖిల్.. మైత్రి నిర్మాతలతో బిగ్గెస్ట్ ప్లాన్!
అక్కినేని హీరోల్లో ఎవరికి కూడా మొదటి అడుగులోనే విజయం అంత ఈజీగా దక్కలేదు. నాగార్జున నుంచి కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తే కానీ బాక్సాఫీస్ వద్ద ఒక మార్కెట్ సెట్టవ్వలేదు. నాగ చైతన్య కూడా అదే తరహాలో వెళుతున్నాడు. ఇక సక్సెస్ అందుకోవాల్సింది అఖిల్ మాత్రమే. అతని మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు.
ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను పూర్తి చేసిన అఖిల్ ఆ తరువాత సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమాతో పక్కా హిట్టు కొట్టేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. మొదటిసారి ఫిట్నెస్ లో పూర్తిగా మార్పులు చేసిన అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడట.
అయితే ఆ రెండు సినిమాలు విడుదల కాకముందే మరో సినిమాపై క్లారిటీ ఇవ్వాలని అఖిల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తో ఇటీవల చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇక దర్శకుడు మరెవరో కాదు. Rx100 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ దర్శకుడు మహాసముద్రం అనే లవ్ స్టోరీతో సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా తరువాత అఖిల్ తో కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.